బీఎస్ఎఫ్కు తొలి మహిళా అధికారిణి
- March 25, 2017
ఉగ్రవాదం, దేశ సరిహద్దుల సంరక్షణలో భారత సరిహద్దు భద్రతా దళాలు(బీఎస్ఎఫ్) కీలక పాత్ర పోషిస్తాయి. 51 సంవత్సరాల తర్వాత తొలిసారిగా మహిళా బీఎస్ఎఫ్ అధికారిణిని నియమించారు. రాజస్థాన్లోని బికనీర్కు చెందిన తనుశ్రీ పరీక్ (25) బీఎస్ఎఫ్ అధికారిణిగా నియమితులయ్యారు. 2014 అర్హతా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన తనుశ్రీ మహారాష్ట్రలోని తేనక్పూర్ బీఎస్ఎఫ్ అకాడమీలో 52వారాల శిక్షణ తీసుకున్నారు. శనివారంతో ఆమె శిక్షణకాలం ముగిసింది. అక్కడ నిర్వహించిన బీఎస్ఎఫ్ పాసింగ్ అవుట్ పరేడ్కు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తనుశ్రీను అభినందించి సన్మానించారు.
‘బీఎస్ఎఫ్లో మహిళా ఫీల్డ్ ఆఫీసర్ వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మరింత మంది అమ్మాయిలు బీఎస్ఎఫ్లో చేరాలని’ ఆయన ఆకాంక్షించారు. తనుశ్రీ పంజాబ్లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులో విధులు నిర్వర్తించనున్నారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









