225 మంది భారతీయులు పాక్ చెరలోకి
- March 26, 2017
గుజరాత్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని జఖావు తీరం వద్ద 100 మందికి పైగా భారత జాలర్లను పాకిస్తాన్ అదుపులోకి తీసుకున్నట్టు మత్స్యకారుల సంఘం వెల్లడించింది. జాలర్లతో పాటు మరో 18 పడవలను కూడా పాకిస్తాన్ తీర ప్రాంత గస్తీ దళం (పీఎంఎస్ఏ) పట్టుకెళ్లినట్టు వెల్లడించింది. పీఎంఎస్ఏ నుంచి తప్పించుకుని వచ్చిన జాలర్ల ద్వారా తమకీ విషయం తెలిసినట్టు నేషనల్ ఫిష్వర్కర్స్ ఫోరమ్ (ఎన్ఎఫ్ఎఫ్) సెక్రటరీ మనీశ్ లోథరి పేర్కొన్నారు. మొత్తం ఎంతమంది భారతీయులను అదుపులోకి తీసుకున్నది వెల్లడించాలంటూ పాకిస్తాన్ ఏజెన్సీలతో ఎన్ఎఫ్ఎఫ్ సంప్రదింపులు జరుపుతోంది. కాగా ఇదే నెలలో ఇంతకుముందు పాకిస్తాన్ భారత్కి చెందిన 115 మంది జాలర్లతో పాటు 19 బోట్లను కూడా అదుపులోకి తీసుకుంది.
దీంతో ఈ నెలలో మొత్తం 225 మందిని పాకిస్తాన్ చెరబట్టుకుని తీసుకెళ్లినట్టు లోథరి చెబుతున్నారు. గత శుక్రవారం ఇదే ప్రాంతంలో భారత దళాలు తొమ్మిదిమంది పాకిస్తానీయులతో పాటు ఓ పడవను స్వాధీనం చేసుకుంది. గతనెలలో కూడా మరో నలుగురు జాలర్లను అరెస్టు చేసింది. దీనికి ప్రతిగానే పాక్ భారత జాలర్లను నిర్బంధించినట్టు కనిపిస్తోంది.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!
- యూఏఈలో పిల్లల స్కూల్ లంచ్..నెలకు Dh800 వరకు ఖర్చు..!!
- విద్యా సంస్థల లైసెన్సులు, ఫీజులపై తనిఖీలు చేయాలి..!!
- సౌదీ - ఫ్రాన్స్ సంబంధాల్లో కీలక ముందడుగు..!!
- పిల్లల బ్యాక్ప్యాక్ల ఎంపిక..ఖతార్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక సూచనలు..!!







