225 మంది భారతీయులు పాక్ చెరలోకి
- March 26, 2017గుజరాత్ అంతర్జాతీయ సరిహద్దుల్లోని జఖావు తీరం వద్ద 100 మందికి పైగా భారత జాలర్లను పాకిస్తాన్ అదుపులోకి తీసుకున్నట్టు మత్స్యకారుల సంఘం వెల్లడించింది. జాలర్లతో పాటు మరో 18 పడవలను కూడా పాకిస్తాన్ తీర ప్రాంత గస్తీ దళం (పీఎంఎస్ఏ) పట్టుకెళ్లినట్టు వెల్లడించింది. పీఎంఎస్ఏ నుంచి తప్పించుకుని వచ్చిన జాలర్ల ద్వారా తమకీ విషయం తెలిసినట్టు నేషనల్ ఫిష్వర్కర్స్ ఫోరమ్ (ఎన్ఎఫ్ఎఫ్) సెక్రటరీ మనీశ్ లోథరి పేర్కొన్నారు. మొత్తం ఎంతమంది భారతీయులను అదుపులోకి తీసుకున్నది వెల్లడించాలంటూ పాకిస్తాన్ ఏజెన్సీలతో ఎన్ఎఫ్ఎఫ్ సంప్రదింపులు జరుపుతోంది. కాగా ఇదే నెలలో ఇంతకుముందు పాకిస్తాన్ భారత్కి చెందిన 115 మంది జాలర్లతో పాటు 19 బోట్లను కూడా అదుపులోకి తీసుకుంది.
దీంతో ఈ నెలలో మొత్తం 225 మందిని పాకిస్తాన్ చెరబట్టుకుని తీసుకెళ్లినట్టు లోథరి చెబుతున్నారు. గత శుక్రవారం ఇదే ప్రాంతంలో భారత దళాలు తొమ్మిదిమంది పాకిస్తానీయులతో పాటు ఓ పడవను స్వాధీనం చేసుకుంది. గతనెలలో కూడా మరో నలుగురు జాలర్లను అరెస్టు చేసింది. దీనికి ప్రతిగానే పాక్ భారత జాలర్లను నిర్బంధించినట్టు కనిపిస్తోంది.
తాజా వార్తలు
- మెట్రో అమ్మకం పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
- హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ లో మగ తెల్లపులి మృత్యువాత
- బయోమెట్రిక్ ఫింగర్ప్రింట్ గడువు పొడిగింపు
- కువైట్ నుండి బయలుదేరిన మెజెస్టి ది సుల్తాన్
- రియల్ ఎస్టేట్ ఏజెంట్లపై కొరడా..7 సంస్థల లైసెన్స్లు సస్పెండ్
- యూఏఈ ఫ్లైట్స్..కొత్త ప్రోటోకాల్ జారీ
- వారంలో 450,000 మంది ప్రజలు రఫా నుండి తరలిపోయారు.. UN
- యూఏఈలో దశల వారీగా జయవాన్ డెబిట్ కార్డ్ల జారీ
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్