225 మంది భారతీయులు పాక్ చెరలోకి

- March 26, 2017 , by Maagulf
225 మంది భారతీయులు పాక్ చెరలోకి

గుజరాత్‌ అంతర్జాతీయ సరిహద్దుల్లోని జఖావు తీరం వద్ద 100 మందికి పైగా భారత జాలర్లను పాకిస్తాన్ అదుపులోకి తీసుకున్నట్టు మత్స్యకారుల సంఘం వెల్లడించింది. జాలర్లతో పాటు మరో 18 పడవలను కూడా పాకిస్తాన్ తీర ప్రాంత గస్తీ దళం (పీఎంఎస్ఏ) పట్టుకెళ్లినట్టు వెల్లడించింది. పీఎంఎస్ఏ నుంచి తప్పించుకుని వచ్చిన జాలర్ల ద్వారా తమకీ విషయం తెలిసినట్టు నేషనల్ ఫిష్‌వర్కర్స్ ఫోరమ్ (ఎన్ఎఫ్ఎఫ్) సెక్రటరీ మనీశ్ లోథరి పేర్కొన్నారు. మొత్తం ఎంతమంది భారతీయులను అదుపులోకి తీసుకున్నది వెల్లడించాలంటూ పాకిస్తాన్ ఏజెన్సీలతో ఎన్ఎఫ్ఎఫ్ సంప్రదింపులు జరుపుతోంది. కాగా ఇదే నెలలో ఇంతకుముందు పాకిస్తాన్ భారత్‌కి చెందిన 115 మంది జాలర్లతో పాటు 19 బోట్లను కూడా అదుపులోకి తీసుకుంది.
దీంతో ఈ నెలలో మొత్తం 225 మందిని పాకిస్తాన్ చెరబట్టుకుని తీసుకెళ్లినట్టు లోథరి చెబుతున్నారు. గత శుక్రవారం ఇదే ప్రాంతంలో భారత దళాలు తొమ్మిదిమంది పాకిస్తానీయులతో పాటు ఓ పడవను స్వాధీనం చేసుకుంది. గతనెలలో కూడా మరో నలుగురు జాలర్లను అరెస్టు చేసింది. దీనికి ప్రతిగానే పాక్ భారత జాలర్లను నిర్బంధించినట్టు కనిపిస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com