సతాఫల్ రబ్డీ
- March 27, 2017
కావలసిన పదార్థాలు: పాలు- ఒక లీటరు, చక్కెర- పావుకేజీ, సీతాఫలాలు- మూడు, కస్టర్డ్ పౌడర్- ఒకటేబుల్ స్పూను
తయారీ విధానం: ఒక గిన్నెలో పాలు పోసి చక్కెర వేసి మరిగించాలి. మరొక గిన్నెలో రెండు కప్పుల పాలు తీసుకొని దానిలో కస్టర్డ్ పౌడర్ వేసి బాగా కలిపి ముందుగా కాగబెట్టిన పాలల్లో పోయాలి. ఈ పాలను మళ్లీ పావుగంటపాటు మరిగించి పక్కన పెట్టుకోవాలి. సీతాఫలంలో గింజలు తీసేసి కొద్దిగా పాలు పోసి మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పాలల్లో వేసి బాగా కలిపి ఫ్రిజ్లో పెట్టాలి. అంతే సీతాఫల్ రబ్డీ రెడీ...! ఆరు గంటల తరువాత ఫ్రిజ్లోంచి తీసి బాదంపప్పు చల్లుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది.
తాజా వార్తలు
- శ్రీలంక పై న్యూజిలాండ్ విజయం
- సైబరాబాద్లో ‘ఏఐ’ ట్రాఫిక్ మంత్రం
- ఇజ్రాయెల్ పార్లమెంట్లో చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ..
- జూలైకి వెలిగొండ తొలిదశ పూర్తి చేసి నీళ్లు ఇస్తాం: సీఎం చంద్రబాబు
- నెతన్యాహు ఘన స్వాగతం, మోదీ ఇజ్రాయెల్ పర్యటన హైలైట్!
- గుడ్ న్యూస్..భారత్ కు వెనిజులా ఆయిల్ వచ్చేస్తోంది!
- ముంబైలో పెరుగుతున్న వాయు కాలుష్యం
- లోక్ భవన్లో అరుణాచల్ ప్రదేశ్, మిజోరం వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో శంతను నారాయణ్ భేటీ
- ఇండియా స్కిల్స్ సౌత్ రీజినల్స్(2025-26) లో ఆంధ్రప్రదేశ్ కు 23 పతకాలు









