ఆరోగ్యానికి.. అందానికి మేలు చేసే పెరుగు.. ఎముకలు బలపడేలా?
- March 29, 2017
పిల్లలకు పెరుగు రోజూ వారీ ఆహారంలో చేర్చాలి. అలాగే పెద్దలు కూడా రోజూ రెండు కప్పుల పెరుగును ఆహారంలో చేర్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని విటమిన్ బి 12 శరీరంలో ఎర్రరక్తణాల సంఖ్యను పెంచుతుంది. ఇంకా నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే వీటిలోని ప్రో బయోటిక్స్ శరీరంలోని తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచుతాయి. ఇందులో లభించే కాల్షియం కారణంగా ఎముకలు ధృడంగా ఉండేందుకు దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగులోని ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు కొవ్వు పదార్థాలను శక్తి రూపంలోకి మార్చడానికి ఉపయోగపడతాయి. అల్సర్తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెప్తున్నారు. చర్మం నిగనిగలాడుతూ కనిపించేలా కూడా పెరుగు ఉపయోగపడుతుంది. రోజూ పెరుగును తీసుకుంటే.. ఎండ వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- ఖతర్లో సేవలకు తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధుకు ఎంబసీ సత్కారం
- IPL 2026: కోల్కతా నైట్ రైడర్స్ కు మరో ఓటమి..
- ఘనంగా జరిగిన ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ వేడుక
- హార్ముజ్ జలసంధిని తెరిచిన ఇరాన్
- సీఎం చంద్రబాబు నాయుడుతో డా. శ్రీధర్ బెవర భేటీ
- ఫుజైరా రూలర్ తో యూఏఈ అధ్యక్షుడు భేటీ.. ఫుజైరా పోర్ట్ పరిశీలన
- ఎన్డీఏకి ఎదురుదెబ్బ..వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు!
- బంగారం దిగుమతుల పై కేంద్రం కీలక నిర్ణయం
- అమెజాన్ ‘AI స్టోర్’ ప్రారంభం
- ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేఠా నియామకం









