ఆరోగ్యానికి.. అందానికి మేలు చేసే పెరుగు.. ఎముకలు బలపడేలా?
- March 29, 2017
పిల్లలకు పెరుగు రోజూ వారీ ఆహారంలో చేర్చాలి. అలాగే పెద్దలు కూడా రోజూ రెండు కప్పుల పెరుగును ఆహారంలో చేర్చుకోవాలి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటారు. ఇందులోని విటమిన్ బి 12 శరీరంలో ఎర్రరక్తణాల సంఖ్యను పెంచుతుంది. ఇంకా నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే వీటిలోని ప్రో బయోటిక్స్ శరీరంలోని తెల్ల రక్తకణాల సంఖ్యను పెంచుతాయి. ఇందులో లభించే కాల్షియం కారణంగా ఎముకలు ధృడంగా ఉండేందుకు దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
పెరుగులోని ప్రోటీన్లు, కార్బొహైడ్రేట్లు కొవ్వు పదార్థాలను శక్తి రూపంలోకి మార్చడానికి ఉపయోగపడతాయి. అల్సర్తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుందని వైద్యులు చెప్తున్నారు. చర్మం నిగనిగలాడుతూ కనిపించేలా కూడా పెరుగు ఉపయోగపడుతుంది. రోజూ పెరుగును తీసుకుంటే.. ఎండ వేడికి చర్మం పాడవకుండా చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!







