మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ను కలిశారు
- March 31, 2017
భారత పర్యటనలో ఉన్న మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ను కలిశారు. చెన్నైలోని పోయస్గార్డెన్లోని రజనీ నివాసంలో ఇరువురూ సమావేశమయ్యారు. దీనిపై రజనీకాంత్ మాట్లాడుతూ.. ‘గతంలో సినిమా చిత్రీకరణ కోసం మలేసియా వెళ్లినప్పుడు ఆ దేశ ప్రధానిని కలవలేకపోయాను. అందుకే ఆయన భారత్లో ఉన్నారని తెలిసి ఇప్పుడు కలిశాను’ అని చెప్పారు. మలేసియాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని రజాక్ తనని కోరలేదని, అవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని రజనీ అన్నారు. అటు మలేసియా ప్రధాని కూడా రజనీకాంత్ను కలవాలని అధికారులను కోరినట్లు సమాచారం. .
ఐదు రోజుల పర్యటనలో భాగంగా మలేసియా ప్రధాని రజాక్ గురువారం భారత్కు వచ్చారు.
తమిళనాడు సీఎం పళనిస్వామి, గవర్నర్ విద్యాసాగర్రావులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేడు ఆయన దిల్లీకి బయల్దేరనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







