మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ను కలిశారు
- March 31, 2017
భారత పర్యటనలో ఉన్న మలేసియా ప్రధానమంత్రి నజీబ్ రజాక్ ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ను కలిశారు. చెన్నైలోని పోయస్గార్డెన్లోని రజనీ నివాసంలో ఇరువురూ సమావేశమయ్యారు. దీనిపై రజనీకాంత్ మాట్లాడుతూ.. ‘గతంలో సినిమా చిత్రీకరణ కోసం మలేసియా వెళ్లినప్పుడు ఆ దేశ ప్రధానిని కలవలేకపోయాను. అందుకే ఆయన భారత్లో ఉన్నారని తెలిసి ఇప్పుడు కలిశాను’ అని చెప్పారు. మలేసియాకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండాలని రజాక్ తనని కోరలేదని, అవన్నీ వట్టి పుకార్లు మాత్రమేనని రజనీ అన్నారు. అటు మలేసియా ప్రధాని కూడా రజనీకాంత్ను కలవాలని అధికారులను కోరినట్లు సమాచారం. .
ఐదు రోజుల పర్యటనలో భాగంగా మలేసియా ప్రధాని రజాక్ గురువారం భారత్కు వచ్చారు.
తమిళనాడు సీఎం పళనిస్వామి, గవర్నర్ విద్యాసాగర్రావులతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేడు ఆయన దిల్లీకి బయల్దేరనున్నారు.
తాజా వార్తలు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!









