ఎన్‌ఆర్‌ఐలకు మరో అవకాశం రద్దయిన నోట్లు జమపై జూన్‌ 30వ తేదీ వరకు

- March 31, 2017 , by Maagulf
ఎన్‌ఆర్‌ఐలకు మరో అవకాశం రద్దయిన నోట్లు జమపై జూన్‌ 30వ తేదీ వరకు

రద్దయిన రూ.1000, రూ.500 నోట్లను మార్చుకోవడానికి ప్రవాస భారతీయు (ఎన్‌ఆర్‌ఐ)లకు మరో అవకాశం లభించింది. వారికి జూన్‌ 30వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అయితే ఒకరు రూ.25 వేలకు మించి తీసుకురావడానికి వీల్లేదు. ఆ తరువాత గడువు పెంచే సూచనలు కూడా లేవు. వారు విమానాశ్రయంలో దిగేటప్పుడు కస్టమ్స్‌ అధికారులకు ఈ నోట్లను చూపించి సంబంధిత పత్రాలపై సంతకాలు చేయించాల్సి ఉంటుంది. అనంతరం రిజర్వు బ్యాంకులో నోట్లతో పాటు, వాటినీ సమర్పించాలి.
రిజర్వు బ్యాంకుల వద్ద భారీ వరుసలు: నోట్లు రద్దయిన సమయంలో విదేశాల్లో ఉన్నవారు వాటిని మార్చుకోవడానికి ఇచ్చిన గడువు శుక్రవారం ముగిసింది.
చివరి రోజు కావడంతో రిజర్వు బ్యాంకుల వద్ద భారీ వరుసలు కనిపించాయి. దేశమంతటికీ కేవలం అయిదు...ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై, నాగ్‌పూర్‌ల్లోని రిజర్వు బ్యాంకు కార్యాలయాల్లోనే నోట్ల మార్పిడికి అవకాశం కల్పించారు. తక్కువ సంఖ్యలో కేంద్రాలను ఏర్పాటు చేయడం, నిబంధనలపై తగిన అవగాహన లేకపోవడంతో చివరి రోజున బాగా రద్దీ కనిపించింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com