ఎన్ఆర్ఐలకు మరో అవకాశం రద్దయిన నోట్లు జమపై జూన్ 30వ తేదీ వరకు
- March 31, 2017
రద్దయిన రూ.1000, రూ.500 నోట్లను మార్చుకోవడానికి ప్రవాస భారతీయు (ఎన్ఆర్ఐ)లకు మరో అవకాశం లభించింది. వారికి జూన్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అయితే ఒకరు రూ.25 వేలకు మించి తీసుకురావడానికి వీల్లేదు. ఆ తరువాత గడువు పెంచే సూచనలు కూడా లేవు. వారు విమానాశ్రయంలో దిగేటప్పుడు కస్టమ్స్ అధికారులకు ఈ నోట్లను చూపించి సంబంధిత పత్రాలపై సంతకాలు చేయించాల్సి ఉంటుంది. అనంతరం రిజర్వు బ్యాంకులో నోట్లతో పాటు, వాటినీ సమర్పించాలి.
రిజర్వు బ్యాంకుల వద్ద భారీ వరుసలు: నోట్లు రద్దయిన సమయంలో విదేశాల్లో ఉన్నవారు వాటిని మార్చుకోవడానికి ఇచ్చిన గడువు శుక్రవారం ముగిసింది.
చివరి రోజు కావడంతో రిజర్వు బ్యాంకుల వద్ద భారీ వరుసలు కనిపించాయి. దేశమంతటికీ కేవలం అయిదు...ముంబయి, దిల్లీ, కోల్కతా, చెన్నై, నాగ్పూర్ల్లోని రిజర్వు బ్యాంకు కార్యాలయాల్లోనే నోట్ల మార్పిడికి అవకాశం కల్పించారు. తక్కువ సంఖ్యలో కేంద్రాలను ఏర్పాటు చేయడం, నిబంధనలపై తగిన అవగాహన లేకపోవడంతో చివరి రోజున బాగా రద్దీ కనిపించింది.
తాజా వార్తలు
- మెటా సేవలకు అంతరాయం..ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్!
- ఇరాన్ రాయబారిని పిలిపించిన జోర్డాన్.. క్షిపణి దాడులు వెంటనే నిలిపివేయాలని డిమాండ్
- రాజమండ్రిలో తొలి కరోనా కేసు నమోదు
- అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న జనసేన పార్లమెంటరీ పార్టీ నేత బాలశౌరి
- అకాబా విమానాశ్రయం, పోర్టుకు ఎలాంటి ముప్పు లేదు: జోర్డాన్ ప్రభుత్వం
- సరికొత్త చరిత్ర సృష్టించిన పీవీ సింధు
- తిరుమలలో రూమ్ ఎలా పొందాలో తెలుసా?
- ఇరాన్ రెండో దాడితో కువైట్ విద్యుత్ కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం.. అత్యవసర ప్రణాళికలు అమలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!







