ఎన్ఆర్ఐలకు మరో అవకాశం రద్దయిన నోట్లు జమపై జూన్ 30వ తేదీ వరకు
- March 31, 2017
రద్దయిన రూ.1000, రూ.500 నోట్లను మార్చుకోవడానికి ప్రవాస భారతీయు (ఎన్ఆర్ఐ)లకు మరో అవకాశం లభించింది. వారికి జూన్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అయితే ఒకరు రూ.25 వేలకు మించి తీసుకురావడానికి వీల్లేదు. ఆ తరువాత గడువు పెంచే సూచనలు కూడా లేవు. వారు విమానాశ్రయంలో దిగేటప్పుడు కస్టమ్స్ అధికారులకు ఈ నోట్లను చూపించి సంబంధిత పత్రాలపై సంతకాలు చేయించాల్సి ఉంటుంది. అనంతరం రిజర్వు బ్యాంకులో నోట్లతో పాటు, వాటినీ సమర్పించాలి.
రిజర్వు బ్యాంకుల వద్ద భారీ వరుసలు: నోట్లు రద్దయిన సమయంలో విదేశాల్లో ఉన్నవారు వాటిని మార్చుకోవడానికి ఇచ్చిన గడువు శుక్రవారం ముగిసింది.
చివరి రోజు కావడంతో రిజర్వు బ్యాంకుల వద్ద భారీ వరుసలు కనిపించాయి. దేశమంతటికీ కేవలం అయిదు...ముంబయి, దిల్లీ, కోల్కతా, చెన్నై, నాగ్పూర్ల్లోని రిజర్వు బ్యాంకు కార్యాలయాల్లోనే నోట్ల మార్పిడికి అవకాశం కల్పించారు. తక్కువ సంఖ్యలో కేంద్రాలను ఏర్పాటు చేయడం, నిబంధనలపై తగిన అవగాహన లేకపోవడంతో చివరి రోజున బాగా రద్దీ కనిపించింది.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









