ఒబామా తో భేటీ అయిన భారత్ ప్రధాని నరేంద్ర మోదీ

- September 28, 2015 , by Maagulf
ఒబామా తో భేటీ అయిన భారత్ ప్రధాని నరేంద్ర మోదీ

అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచ అగ్రదేశాధినేతలతో సమావేశమయ్యారు. భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోదీ భేటీ అయ్యారు. ఏడాదికాలంలో ఈ ఇద్దరు నేతలూ కలవడమిది మూడోసారి. ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాల గురించి మోదీ, ఒబామా దాదాపు గంటా పది నిమిషాల పాటు చర్చించనున్నారు. ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోదీ అంతకుముందు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్కోయిస్ హోలాండె లతో సమావేశమయ్యారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com