శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికుల కష్టాలకు చెక్‌

- April 01, 2017 , by Maagulf
శంషాబాద్‌ విమానాశ్రయంలో ప్రయాణికుల కష్టాలకు చెక్‌

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుల కష్టాలకు తెరపడనుంది. దేశంలోనే తొలిసారిగా ప్యాసింజర్‌ ఈజ్‌ ప్రైమ్‌ అనే నినాదంతో వాలంటీర్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు ఎయిర్‌పోర్టు అధికారులు. ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌లో కస్టమర్లను రిసీవ్‌ చేసుకునే రీతిలో.. 50 మంది వాలంటీర్లను నియమించారు. ఈ సేవలను సీఈవో SGK కిశోర్‌ లాంఛనంగా ప్రారంభించారు. దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాలకు సంబంధించి బ్యాగేజ్‌ స్టాపింగ్‌ విధానాన్ని పూర్తిగా రద్దు చేసినట్లు కిశోర్‌ ప్రకటించారు. మరో నెలరోజుల్లో అన్ని విమాన సర్వీసులను ఈ-బోర్డింగ్‌తో అనుసంధానం చేయనున్నట్లు ఆయన చెప్పారు. త్వరలోనే వాలంటీర్ల సంఖ్యను 150కి పెంచనున్నట్లు కిశోర్‌ ప్రకటించారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com