యువతీ మృతికి కారకుడైన జిసిసి వ్యక్తికి 200,000 క్యూ ఆర్ రక్త పరిహారం
- April 02, 2017
రోడ్డుపై దృష్టి నిలపక అడ్డదిడ్డంగా వాహనాలను నడిపేవారికి దోహా న్యాయస్థానం ఓ ఝలక్ ఇచ్చింది. నిర్లక్ష్యంగా ద్విచక్రవాహనం నడిపి తన ముందు మరో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఒక యువతిని ఢీ కొట్టి ఆమె మరణానికి కారణమైన జీసీసీ వ్యక్తికి దోహా క్రిమినల్ న్యాయస్థానం10, 000 కతర్ రియాళ్ళు జరిమానా విధించి ఆ యువతీ కుటుంబానికి రక్త పరిహారం కింద మరో 200,000 కతర్ రియాళ్ళు చెల్లించాలని ఆదేశించింది.మరణించిన ఆ యువతీ సి లైన్ ఏరియాలో తన క్వాడ్ బైక్ మీద నెమ్మదిగా వెళుతుండగా...వెనుక నుండి నిర్లక్ష్యంగా మరో ద్విచక్ర వాహనంపై వస్తున్న జీసీసీ వ్యక్తి ఆ యువతీ క్వాడ్ బైక్ ను అత్యంత వేగంగా.' డీ ' కొట్టాడు. దీనితో ఆ యువతీ తన ద్విచక్ర వాహనం పై నుంచి గాలిలోనికి ఎగిరి మరో కారుని బలంగా తాకింది. దాంతో ఆమె అక్కడికక్కడే ప్రాణం కోల్పోయింది. ఈ కేసులో మరణించిన యువతీ యొక్క చట్టపరమైన వారసులకు 200, 000 కతర్ రియళ్ళ రక్తపరిహారం చెల్లించాలని ప్రతివాదికి గౌరవనీయ కోర్టు ఆదేశించింది.
తాజా వార్తలు
- ఇరాన్ అధ్యక్షుడితో అమీర్ చర్చలు..!!
- అల్ హదీథా బార్డర్ వద్ద స్మగ్లింగ్ గుట్టురట్టు..!!
- యూఏఈలో ఫిబ్రవరి పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- కువైట్-ఢిల్లీ ఫ్లైట్ కు బాంబు బెదిరింపు..!!
- ముత్రా కేబుల్ కార్ ప్రమాదంలో ఇద్దరు మృతి..!!
- సీజనల్ ఫిషింగ్ బ్యాన్ ఎత్తివేతకు బహ్రెయిన్ నిరాకరణ..!!
- నిజమా లేదా నకిలీనా? CPA మార్గదర్శకాలు జారీ..!!
- కువైట్ కార్ల వేల ప్రాజెక్టుకు ఫుల్ డిమాండ్..!!
- ఖతార్ బ్యాంకులు స్ట్రాంగ్ గ్రోత్..!!
- బహ్రెయిన్ లో హెల్త్ టూరిజం వీసా, కొత్త పర్యవేక్షక కమిటీ..!!







