కేరళ వలస కార్మికులకు ఆరోగ్య భీమా తప్పనిసరి
- September 28, 2015
కేరళ నుంచి విదేశాలకు వెళ్ళాలనుకునేవారికి ఆరోగ్య భీమా తప్పనిసరి కానుంది. ఇందుకోసం కేరళ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. భారతదేశం నుంచి అధికారికంగా ఇప్పటివరకు ఇలాంటి 'తప్పనిసరి' నిబంధన లేదు. కేరళ ప్రభుత్వం ఈ నిబంధనను అమలులోకి తీసుకొస్తే, దేశంలోనే తొలి రాష్ట్రంగా ఈ విభాగంలో కేరళ అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. విదేశాల్లో ఉంటున్న కార్మికులు ఈ అంశంపై చర్చిస్తున్నారు. కేరళ ప్రభుత్వం కూడా వారితో చర్చలు జరుపుతోంది. భీమా ప్రీమియం ఎలా ఉండాలి? ఎంతవరకు అది అత్యవసరం? అనే అంశాలను చర్చిస్తున్నట్లు నాన్ రెసిడెంట్ కేరళైట్స్ డిపార్ట్మెంట్ (నోర్కా) సెక్రెటరీ రాణి జార్జ్ చెప్పారు. ఫిలిప్పీన్ దేశంలో ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తప్పనిసరి నిబంధన అమల్లో ఉంది. 2014 అంచనాల ప్రకారం 2.3 మిలియన్ రేరళీయులు విదేశాల్లో ఉంటున్నారు. వారిలో ఎక్కువమంది గల్ప్ దేశాల్లోనే ఉపాధి పొందుతున్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







