మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నఅబుధాబి యువరాజు
- April 02, 2017
అబుధాబి యువరాజు మరోసారి తన ఔన్నత్యాన్ని చాటుకున్నాడు.యు.ఏ.ఈలోని ఫుజైరః అనే ప్రాంతంలో ఒక అపార్ట్మెంట్లో నివసిస్తున్న కుటుంబంపై ఒక వ్యక్తి హత్య ప్రయత్నం చేశాడు. ఆ దాడిలో ఇంటి యజమానురాలు అక్కడిక్కడే చనిపోయింది. వారింట్లో పనిచేస్తున్నా పనిమనిషితో సహ పిల్లలద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఆ దుర్మార్గం నుంచి గాయాలతో బయటపడ్డ పిల్లలిద్దరిని, పనిమనిషిని రాజు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ పరామర్శించారు. వారు షేక్ ఖలీఫా మెడికల్ సీటీ హస్పటల్లో చికిత్స పొందుతున్నారు. వారికి ఎటువంటి చికిత్స అందిస్తున్నారని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అలాగే వారికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఆయన పర్యటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలను సిబ్బంది సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దాంతో రాజు సామాన్య బాధితులను పరామర్శించడం తెలిసి చాలా మంది ఆశ్చర్యపోయారు. సామాన్యుల పట్ల ఆయన చూపుతున్న ఆదరణను పలువురు కొనియాడారు.
తాజా వార్తలు
- హైదరాబాద్: 32 మంది బ్యాంకు అధికారుల అరెస్ట్..
- గచ్చిబౌలిలో భారీ అగ్నిప్రమాదం: 15 బైకులు దగ్ధం
- ఒమన్ గల్ఫ్లో ముదిరిన ఉద్రిక్తతలు
- మలేషియాలో ఘోర అగ్నిప్రమాదం..వెయ్యి ఇళ్లు దగ్ధం
- అమెరికాలో మాస్ షూటింగ్…8 చిన్నారులు మృతి
- ఘర్రాఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ వద్ద రోడ్ మూసివేత..!!
- సౌదీ అరేబియాలో ఉరుములతో కూడిన వర్షాలు..!!
- యూఏఈలో నిత్యావసర వస్తువుల ధరలను పోల్చడానికి కొత్త వేదిక..!!
- ఒమన్ మానవ హక్కుల కమిషన్ (OHRC) పునర్నిర్మాణం..!!
- జాతీయ భద్రతా ఉల్లంఘనలపై తక్షణ చర్యలకు ఆదేశాలు..!!









