ఎఫ్ఎన్సీ పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు
- September 28, 2015
2015 ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ ఎన్నికల కోసం దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఓటర్లు బారులు తీరారు. తమ అనుచరులతో 60 మంది వరకూ దుబాయ్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. దుబాయ్ మున్సిపాలిటీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ బాడీస్ ఇస్మాయిల్ అల్బన్న అల్ బస్తకి సోమవారం పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నవారిలో ఒకరు. గత ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు ఆయన చెప్పారు. ఓటర్లు నేరుగా ఓటు వేయడానికి వెళుతున్నారనీ, ఎలాంటి ఇబ్బందులూ తలెత్తడంలేదని ఆయన అన్నారు. ఓటర్లు అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకుని, అభ్యర్థులను గెలిపించాలనుకుంటారని ఓటు వేసేందుకు వచ్చిన పలువురు అభిప్రాయపడ్డారు. తండ్రి కాబట్టి ఆయనకే ఓటు వేయాలనుకోవడం కన్నా, ఆయన చేసిన అభివృద్ధి పనుల్ని చూసి ఓటేయాలని వచ్చినట్లు ఓ అభ్యర్థి కుమారుడు చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







