ఎఫ్‌ఎన్‌సీ పోలింగ్‌ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు

- September 28, 2015 , by Maagulf
ఎఫ్‌ఎన్‌సీ పోలింగ్‌ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు

2015 ఫెడరల్  నేషనల్‌ కౌన్సిల్‌ ఎన్నికల కోసం దుబాయ్‌ వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ వద్ద ఓటర్లు బారులు తీరారు. తమ అనుచరులతో 60 మంది వరకూ దుబాయ్‌ అభ్యర్థులు పోలింగ్‌ కేంద్రాలను సందర్శించారు. దుబాయ్‌ మున్సిపాలిటీ డైరెక్టర్‌ ఆఫ్‌ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్‌ అండ్‌ బాడీస్‌ ఇస్మాయిల్‌ అల్బన్న అల్‌ బస్తకి సోమవారం పోలింగ్‌ కేంద్రం వద్దకు చేరుకున్నవారిలో ఒకరు. గత ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు పోలింగ్‌ ప్రశాంతంగా సాగుతున్నట్లు ఆయన చెప్పారు. ఓటర్లు నేరుగా ఓటు వేయడానికి వెళుతున్నారనీ, ఎలాంటి ఇబ్బందులూ తలెత్తడంలేదని ఆయన అన్నారు. ఓటర్లు అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకుని, అభ్యర్థులను గెలిపించాలనుకుంటారని ఓటు వేసేందుకు వచ్చిన పలువురు అభిప్రాయపడ్డారు. తండ్రి కాబట్టి ఆయనకే ఓటు వేయాలనుకోవడం కన్నా, ఆయన చేసిన అభివృద్ధి పనుల్ని చూసి ఓటేయాలని వచ్చినట్లు ఓ అభ్యర్థి కుమారుడు చెప్పారు. 

 

--సి.శ్రీ(దుబాయ్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com