ఎఫ్ఎన్సీ పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన ఓటర్లు
- September 28, 2015
2015 ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ ఎన్నికల కోసం దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ వద్ద ఓటర్లు బారులు తీరారు. తమ అనుచరులతో 60 మంది వరకూ దుబాయ్ అభ్యర్థులు పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. దుబాయ్ మున్సిపాలిటీ డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ బాడీస్ ఇస్మాయిల్ అల్బన్న అల్ బస్తకి సోమవారం పోలింగ్ కేంద్రం వద్దకు చేరుకున్నవారిలో ఒకరు. గత ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు పోలింగ్ ప్రశాంతంగా సాగుతున్నట్లు ఆయన చెప్పారు. ఓటర్లు నేరుగా ఓటు వేయడానికి వెళుతున్నారనీ, ఎలాంటి ఇబ్బందులూ తలెత్తడంలేదని ఆయన అన్నారు. ఓటర్లు అన్ని అంశాల్నీ పరిగణనలోకి తీసుకుని, అభ్యర్థులను గెలిపించాలనుకుంటారని ఓటు వేసేందుకు వచ్చిన పలువురు అభిప్రాయపడ్డారు. తండ్రి కాబట్టి ఆయనకే ఓటు వేయాలనుకోవడం కన్నా, ఆయన చేసిన అభివృద్ధి పనుల్ని చూసి ఓటేయాలని వచ్చినట్లు ఓ అభ్యర్థి కుమారుడు చెప్పారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







