ఇజ్రాయిల్‌ తో భారత్ భారీ ఒప్పందం

- April 07, 2017 , by Maagulf
ఇజ్రాయిల్‌ తో భారత్ భారీ ఒప్పందం

ఇజ్రాయిల్‌ భారత్‌తో 2 బిలియన్‌ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్‌కి ఆధునిక టెక్నాలజీతో తయారుచేసిన నేవీ, ఆర్మీ క్షిపణులను సరఫరా చేయడానికి ఈ ఒప్పందం చేసుకొన్నట్లు ఐఏఐ(ఇజ్రాయిల్‌ ఎరోస్పేస్‌ ఇండస్ట్రీస్‌) గురువారం వెల్లడించింది. ఇజ్రాయిల్‌ చరిత్రలో ఇంతటి భారీ ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ 2 బిలియన్‌ డాలర్ల ఒప్పందంలో ఐఏఐ వాటా 1.6 బిలియన్‌ డాలర్లు. మిగతా మొత్తం మరో దేశానికి చెందిన రాఫెల్‌ కంపెనీ సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా ఇజ్రాయిల్‌ బరాక్‌ 8 (మీడియం రేంజ్‌ క్షిపణి), లాంగ్‌ రేంజ్‌ క్షిపణులను భారత్‌కు సరఫరా చేయనుంది. బరాక్‌ 8 క్షిపణులు 50 నుంచి 70 కి.మీ.ల వరకు డ్రోన్లను, వైమానిక దాడులను తిప్పికొట్టగలదు. ఈ ఒప్పందాన్ని బట్టి చూస్తే ఐఏఐ ఆధునిక టెక్నాలజీపై, సామర్థ్యాలపై భారత ప్రభుత్వానికి నమ్మకం ఉన్నట్లు తెలుస్తోందని ఐఏఐ సీఈవో జోసెఫ్‌ వీస్‌ మీడియా ద్వారా తెలిపారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com