సిరియా ఎయిర్ బేస్ పై అమెరికా దాడి, 9 మంది మృతి

- April 07, 2017 , by Maagulf
సిరియా ఎయిర్ బేస్ పై అమెరికా దాడి, 9 మంది మృతి

తిరుగుబాటుదారులు లక్ష్యంగా సిరియాపై అమెరికా చేపట్టిన క్షిపణి దాడుల్లో 9 మంది మృతిచెందారు. సెంట్రల్‌ సిరియాలోని ఎయిర్‌బేస్‌పై చేసిన దాడుల్లో నలుగురు చిన్నారులు సహా 9 మంది పౌరులు మృతిచెందినట్లు సిరియా మీడియా వెల్లడించింది. సిరియాలోని తిరుగుబాటుదారులు అధికంగా ఉండే ప్రాంతాలపై అమెరికా క్షిపణులతో దాడి చేసిన విషయం తెలిసిందే. మధ్యధరా సముద్రంలోని యుద్ధనౌక నుంచి 59 తోమహౌక్‌ క్షిపణులను అమెరికా ప్రయోగించింది. సిరియాలో ఇటీవల జరిగిన రసాయన దాడులకు వ్యతిరేకంగానే ఈ దాడులు చేపట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పారు. సిరియాలో ఇటీవల రసాయన దాడులు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో చిన్నారులు సహా 70మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com