భారత్తో ఇజ్రాయిల్ 2 బిలియన్ డాలర్ల ఒప్పందం
- April 08, 2017
ఇజ్రాయిల్ భారత్తో 2 బిలియన్ డాలర్ల ఒప్పందాన్ని కుదుర్చుకుంది. భారత్కి ఆధునిక టెక్నాలజీతో తయారుచేసిన నేవీ, ఆర్మీ క్షిపణులను సరఫరా చేయడానికి ఈ ఒప్పందం చేసుకొన్నట్లు ఐఏఐ(ఇజ్రాయిల్ ఎరోస్పేస్ ఇండస్ట్రీస్) గురువారం వెల్లడించింది. ఇజ్రాయిల్ చరిత్రలో ఇంతటి భారీ ఒప్పందం కుదుర్చుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ 2 బిలియన్ డాలర్ల ఒప్పందంలో ఐఏఐ వాటా 1.6 బిలియన్ డాలర్లు. మిగతా మొత్తం మరో దేశానికి చెందిన రాఫెల్ కంపెనీ సొంతం చేసుకుంది. ఇందులో భాగంగా ఇజ్రాయిల్ బరాక్ 8 (మీడియం రేంజ్ క్షిపణి), లాంగ్ రేంజ్ క్షిపణులను భారత్కు సరఫరా చేయనుంది. బరాక్ 8 క్షిపణులు 50 నుంచి 70 కి.మీ.ల వరకు డ్రోన్లను, వైమానిక దాడులను తిప్పికొట్టగలదు.
ఈ ఒప్పందాన్ని బట్టి చూస్తే ఐఏఐ ఆధునిక టెక్నాలజీపై, సామర్థ్యాలపై భారత ప్రభుత్వానికి నమ్మకం ఉన్నట్లు తెలుస్తోందని ఐఏఐ సీఈవో జోసెఫ్ వీస్ మీడియా ద్వారా తెలిపారు.
తాజా వార్తలు
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!
- ఏప్రిల్ 14 నుండి తెరుచుకోనున్న BAPS హిందూ మందిర్..!!
- అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు విఫలం..









