పశ్చిమ మయన్మార్లో పెళ్లి పడవ మునిగి 20 మంది మృతి
- April 08, 2017
పెళ్లి పడవ నది వంతెనను ఢీకొట్టడంతో 20 మంది మృత్యువాత పడ్డారు. ఈ దారుణ ఘటన పశ్చిమ మయన్మార్లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం 60 మంది ప్రయాణిస్తున్న ‘సిల్వర్ స్టార్’ అనే పడవ పథేన్ దగ్గరలోని నది వంతెనను శుక్రవారం సాయంత్రం ఢీకొంది. ఈ ప్రమాదంలో పెళ్లికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న 16 మంది మహిళలు, 4 పురుషులు మృతి చెందారు. కనీసం తొమ్మిది మంది గల్లంతయ్యి ఉంటారని, 30 మందిని రక్షించామని స్థానిక ఎంపీ ఆంగ్ తు హెట్వే తెలిపారు.
మయన్మార్లో పడవ ప్రమాదాలు తరచూ జరుగుతుంటాయి. గత అక్టోబరులో ఉపాధ్యాయులు, విద్యార్థులతో కూడిన పడవ అధిక లోడ్ కారణంగా ప్రమాదానికి గురైంది.
ఈ ఘటనలో 73 మంది మృతి చెందారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం
- ప్రముఖ గాయని ఆశా భోస్లే కన్నుమూత
- అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధుల వెల్లువ
- శాంతి చర్చల పై పాక్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు
- శాంతి చర్చల విజయం అమెరికా చేతుల్లోనే ఉందన్న ఇరాన్ అధ్యక్షుడు
- ఒమన్ చమురు ఉత్పత్తి సామర్థ్యం పెంపు..!!
- రుణగ్రహీతల పై ట్రావెల్ బ్యాన్ పునరుద్ధరణపై బహ్రెయిన్ క్లారిటీ..!!
- 'లక్కీ డే' డ్రా విజేతలను ప్రకటించిన యూఏఈ లాటరీ..!!
- 93 వయలేషన్స్ నమోదు చేసిన వాణిజ్య మంత్రిత్వ శాఖ..!!
- సౌదీ అరేబియాలో 7,392 మంది పై బహిష్కరణ వేటు..!!









