న్యూ ఢిల్లీ చేరుకున్న ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్బుల్
- April 09, 2017
ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్బుల్ నాలుగు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి దిల్లీకి చేరుకున్నారు. రక్షణ, భద్రత, ఇంధనం, వాణిజ్యం సహా పలు కీలక అంశాలపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ) ఈ పర్యటనలో కుదిరే అవకాశంలేదని ఆస్ట్రేలియా స్పష్టంచేసింది. పర్యావరణం, పునరుత్పాదక ఇంధనం, క్రీడలు, వాణిజ్యం, రక్షణ రంగాల్లో పలు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ)లు కుదిరే అవకాశముందని తెలిపింది. 2015లో ఆస్ట్రేలియా ప్రధానిగా టర్న్బుల్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు ఇదే తొలి భారత్ పర్యటన.
తాజా వార్తలు
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!









