న్యూ ఢిల్లీ చేరుకున్న ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్‌ టర్న్‌బుల్‌

- April 09, 2017 , by Maagulf
న్యూ ఢిల్లీ చేరుకున్న ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్‌ టర్న్‌బుల్‌

ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్‌ టర్న్‌బుల్‌ నాలుగు రోజుల భారత్‌ పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి దిల్లీకి చేరుకున్నారు. రక్షణ, భద్రత, ఇంధనం, వాణిజ్యం సహా పలు కీలక అంశాలపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ) ఈ పర్యటనలో కుదిరే అవకాశంలేదని ఆస్ట్రేలియా స్పష్టంచేసింది. పర్యావరణం, పునరుత్పాదక ఇంధనం, క్రీడలు, వాణిజ్యం, రక్షణ రంగాల్లో పలు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ)లు కుదిరే అవకాశముందని తెలిపింది. 2015లో ఆస్ట్రేలియా ప్రధానిగా టర్న్‌బుల్‌ బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు ఇదే తొలి భారత్‌ పర్యటన. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com