న్యూ ఢిల్లీ చేరుకున్న ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్బుల్
- April 09, 2017
ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్బుల్ నాలుగు రోజుల భారత్ పర్యటనలో భాగంగా ఆదివారం రాత్రి దిల్లీకి చేరుకున్నారు. రక్షణ, భద్రత, ఇంధనం, వాణిజ్యం సహా పలు కీలక అంశాలపై భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందం (సీఈసీఏ) ఈ పర్యటనలో కుదిరే అవకాశంలేదని ఆస్ట్రేలియా స్పష్టంచేసింది. పర్యావరణం, పునరుత్పాదక ఇంధనం, క్రీడలు, వాణిజ్యం, రక్షణ రంగాల్లో పలు అవగాహన ఒప్పందాలు (ఎంవోయూ)లు కుదిరే అవకాశముందని తెలిపింది. 2015లో ఆస్ట్రేలియా ప్రధానిగా టర్న్బుల్ బాధ్యతలు తీసుకున్నారు. ఆయనకు ఇదే తొలి భారత్ పర్యటన.
తాజా వార్తలు
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ఇరాన్ దాడులతో కువైట్లో చెలరేగిన మంటలు అదుపులోకి.. పలువురికి గాయాలు
- 72 వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు ప్రకటింపు..
- FICCI FLO ప్రధాన కార్యాలయానికి వెయ్యి గజాల స్థలం కేటాయింపు: సీఎం రేవంత్
- అమెరికా పై ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ తీవ్ర విమర్శలు..
- కువైట్, బహ్రెయిన్, జోర్డాన్లపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన GCC
- హైదరాబాద్లో ‘ఆండ్ పర్పస్ ఫోరమ్ 2026’ సదస్సు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!







