గాయాల్ని లెక్కచేయం: భారతీయ కార్మికులు
- April 10, 2017
జెడ్డా:హౌతి మిలిటెంట్లు పేల్చిన షెల్ కారణంగా ఓ భారతీయ కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురు భారతీయ కార్మికులు గాయాలపాలయ్యారు. అయితే కోలుకున్న తర్వాత తిరిగి అదే ప్రాంతంలో పనిచేయడానికి తాము వెనుకాడబోమని వారు చెప్పారు. సివిల్ డిఫెన్స్ డిప్యూటీ అధికార ప్రతినిథి కెప్టెన్ అబ్దుల్లా సయీద్ మాట్లాడుతూ, యెమెనీ బోర్డర్ వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయనీ, ఈ దాడుల్లో ఓ ఇండియన్ వర్కర్ చనిపోగా, మరో ముగ్గురు ఇండియన్స్ గాయపడ్డారనీ, వారిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం షాప్ని ప్రారంభించిన కాస్సేపటికే ఈ దాడి జరిగింది. మృతుడ్ని ఇండియాలోని ఆంధ్రప్రదేశ్కి చెందిన కడప జిల్లా వాసి ఎ.వెంకటసుబ్బారెడ్డిగా గుర్తించారు. ఎనిమిది నెలల క్రితమే ఈయన కింగ్డమ్కి పని నిమిత్తం వచ్చారు. గాయపడ్డవారిలో అజాంగర్ ఉత్తరప్రదేశ్కి చెందిన సంతోష్కుమార్, కడపకి చెందిన ఓబులేష్, తెలంగాణలోని జగిత్యాలకు చెందిన కమలాకర్రావు ఉన్నారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









