గాయాల్ని లెక్కచేయం: భారతీయ కార్మికులు
- April 10, 2017
జెడ్డా:హౌతి మిలిటెంట్లు పేల్చిన షెల్ కారణంగా ఓ భారతీయ కార్మికుడు మృతి చెందగా, మరో ముగ్గురు భారతీయ కార్మికులు గాయాలపాలయ్యారు. అయితే కోలుకున్న తర్వాత తిరిగి అదే ప్రాంతంలో పనిచేయడానికి తాము వెనుకాడబోమని వారు చెప్పారు. సివిల్ డిఫెన్స్ డిప్యూటీ అధికార ప్రతినిథి కెప్టెన్ అబ్దుల్లా సయీద్ మాట్లాడుతూ, యెమెనీ బోర్డర్ వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయనీ, ఈ దాడుల్లో ఓ ఇండియన్ వర్కర్ చనిపోగా, మరో ముగ్గురు ఇండియన్స్ గాయపడ్డారనీ, వారిని ఆసుపత్రికి తరలించామని చెప్పారు. శుక్రవారం ప్రార్థనల అనంతరం షాప్ని ప్రారంభించిన కాస్సేపటికే ఈ దాడి జరిగింది. మృతుడ్ని ఇండియాలోని ఆంధ్రప్రదేశ్కి చెందిన కడప జిల్లా వాసి ఎ.వెంకటసుబ్బారెడ్డిగా గుర్తించారు. ఎనిమిది నెలల క్రితమే ఈయన కింగ్డమ్కి పని నిమిత్తం వచ్చారు. గాయపడ్డవారిలో అజాంగర్ ఉత్తరప్రదేశ్కి చెందిన సంతోష్కుమార్, కడపకి చెందిన ఓబులేష్, తెలంగాణలోని జగిత్యాలకు చెందిన కమలాకర్రావు ఉన్నారు.
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







