భారత పడవను విడిపించిన సోమాలియా దేశ సైన్యం
- April 10, 2017
సోమాలియా సముద్రపు దొంగలు వారం రోజుల క్రితం నిర్బంధించిన భారత పడవను ఆ దేశ సైన్యం రక్షించింది. పడవలోని ఇద్దరు భారతీయులను కాపాడింది. అయితే మరో తొమ్మిది మంది భారతీయులు ఇంకా దొంగల నిర్బంధంలోనే ఉన్నారని హొబ్యో నగర మేయర్ అబ్దుల్లాహి అహ్మద్ సోమవారం తెలిపారు. ఐదేళ్లుగా ఇక్కడి తీరంలో గస్తీపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టడంతో దాడులు కొంతవరకూ తగ్గుముఖం పట్టాయి. సోమాలియా ప్రభుత్వ అస్థిరత్వం కారణంగా ఇటీవల కాలంలో మళ్లీ దాడులు పెరుగుతున్నాయి.
తొమ్మిది మంది సైనికుల మృతి
సొమాలియా రాజధాని మొగదిషు శివారులో సైనిక దుస్తులు ధరించిన ఓ ఉగ్రవాది ఒక సైనిక శిక్షణ శిబిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. దాడి తమ పనేనని అల్ఖైదా అనుబంధ అల్ షబాబ్ చెప్పింది. మరో ఘటనలో కారు బాంబు పేలడంతో ఒక ప్రభుత్వాధికారి మరణించారు.
ఆదివారం మొగదిషు సైనిక స్థావరం వెలుపల కారు బాంబు పేలుడు సంభవించడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









