భారత పడవను విడిపించిన సోమాలియా దేశ సైన్యం
- April 10, 2017
సోమాలియా సముద్రపు దొంగలు వారం రోజుల క్రితం నిర్బంధించిన భారత పడవను ఆ దేశ సైన్యం రక్షించింది. పడవలోని ఇద్దరు భారతీయులను కాపాడింది. అయితే మరో తొమ్మిది మంది భారతీయులు ఇంకా దొంగల నిర్బంధంలోనే ఉన్నారని హొబ్యో నగర మేయర్ అబ్దుల్లాహి అహ్మద్ సోమవారం తెలిపారు. ఐదేళ్లుగా ఇక్కడి తీరంలో గస్తీపై ప్రపంచ దేశాలు దృష్టిపెట్టడంతో దాడులు కొంతవరకూ తగ్గుముఖం పట్టాయి. సోమాలియా ప్రభుత్వ అస్థిరత్వం కారణంగా ఇటీవల కాలంలో మళ్లీ దాడులు పెరుగుతున్నాయి.
తొమ్మిది మంది సైనికుల మృతి
సొమాలియా రాజధాని మొగదిషు శివారులో సైనిక దుస్తులు ధరించిన ఓ ఉగ్రవాది ఒక సైనిక శిక్షణ శిబిరంపై ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. సోమవారం జరిగిన ఈ ఘటనలో తొమ్మిది మంది సైనికులు మృతిచెందారు. మరో 12 మంది గాయపడ్డారు. దాడి తమ పనేనని అల్ఖైదా అనుబంధ అల్ షబాబ్ చెప్పింది. మరో ఘటనలో కారు బాంబు పేలడంతో ఒక ప్రభుత్వాధికారి మరణించారు.
ఆదివారం మొగదిషు సైనిక స్థావరం వెలుపల కారు బాంబు పేలుడు సంభవించడంతో 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!
- మళ్లీ విమాన కార్యకలాపాలను నిలిపివేసిన బహ్రెయిన్..!!
- ఫైర్ వర్క్స్ పై పోలీసుల వార్న్..Dh100,000 ఫైన్, ఏడాది జైలు..!!
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!









