విశాఖలోని 7వేల మందితో కూచిపూడి నృత్య ప్రదర్శన

- April 11, 2017 , by Maagulf
విశాఖలోని 7వేల మందితో కూచిపూడి నృత్య ప్రదర్శన

 డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ 125వ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలకు చెందిన 7వేల మంది బాలికలు సామూహిక కూచిపూడి నృత్య ప్రదర్శన చేపట్టారు. విశాఖలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాల మైదానం ఇందుకు వేదికైంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు చెందిన 21 గురుకుల పాఠశాలలకు చెందిన విద్యార్థినులు గిన్నిస్‌బుక్‌ రికార్డు కోసం ఈ ప్రదర్శన చేశారు.
ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కూచిపూడి మన వారసత్వ సంపదని.. దాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. కూచిపూడి అభివృద్ధికి బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించామన్నారు. కూచిపూడి అకాడమీకి అమరావతిలో స్థలం కేటాయిస్తామన్నారు. అమరావతిలో 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com