ఇండియన్ ఐడల్కు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సన్మానం
- April 12, 2017
ఇండియన్ ఐడల్ సీజన్ 9 టైటిల్ సాధించిన రేవంత్, ఫైనలిస్ట్ రోహిత్లను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సన్మానించారు. బుధవారం ఆయన నివాసంలో రేవంత్, రోహిత్లను కలిసిన కేటీఆర్ వారికి అభినందనలు తెలియజేశారు. ఇరువురికి శాలువా కప్పి, మెమొంటోతో సన్మానించారు. ఆ తర్వాత వారితో సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలను తెలంగాణ ఐటీశాఖ ట్విటర్లో పోస్టు చేసింది.
ప్రఖ్యాత టీవీ కార్యక్రమం ‘ఇండియన్ ఐడల్’లో తెలుగు తేజాలు రేవంత్, రోహిత్లు సత్తాచాటిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న జరిగిన తుదిపోరులో యువ గాయకుడు రేవంత్ టైటిల్ విజేతగా నిలిచాడు. రోహిత్ మూడోస్థానం దక్కించుకున్నాడు. రేవంత్ ఇండియన్ ఐడల్ బిరుదుతో పాటు రూ. 25లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. ఇండియన్ ఐడల్గా నిలిచిన రెండో తెలుగు గాయకుడు రేవంత్ కావడం విశేషం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







