ఇండియన్‌ ఐడల్‌కు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సన్మానం

- April 12, 2017 , by Maagulf
ఇండియన్‌ ఐడల్‌కు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సన్మానం

ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 9 టైటిల్‌ సాధించిన రేవంత్‌, ఫైనలిస్ట్‌ రోహిత్‌లను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ సన్మానించారు. బుధవారం ఆయన నివాసంలో రేవంత్‌, రోహిత్‌లను కలిసిన కేటీఆర్‌ వారికి అభినందనలు తెలియజేశారు. ఇరువురికి శాలువా కప్పి, మెమొంటోతో సన్మానించారు. ఆ తర్వాత వారితో సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలను తెలంగాణ ఐటీశాఖ ట్విటర్లో పోస్టు చేసింది.
ప్రఖ్యాత టీవీ కార్యక్రమం ‘ఇండియన్‌ ఐడల్‌’లో తెలుగు తేజాలు రేవంత్‌, రోహిత్‌లు సత్తాచాటిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 2న జరిగిన తుదిపోరులో యువ గాయకుడు రేవంత్‌ టైటిల్‌ విజేతగా నిలిచాడు. రోహిత్‌ మూడోస్థానం దక్కించుకున్నాడు. రేవంత్‌ ఇండియన్‌ ఐడల్‌ బిరుదుతో పాటు రూ. 25లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. ఇండియన్‌ ఐడల్‌గా నిలిచిన రెండో తెలుగు గాయకుడు రేవంత్‌ కావడం విశేషం.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com