ఇండియన్ ఐడల్కు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సన్మానం
- April 12, 2017
ఇండియన్ ఐడల్ సీజన్ 9 టైటిల్ సాధించిన రేవంత్, ఫైనలిస్ట్ రోహిత్లను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సన్మానించారు. బుధవారం ఆయన నివాసంలో రేవంత్, రోహిత్లను కలిసిన కేటీఆర్ వారికి అభినందనలు తెలియజేశారు. ఇరువురికి శాలువా కప్పి, మెమొంటోతో సన్మానించారు. ఆ తర్వాత వారితో సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలను తెలంగాణ ఐటీశాఖ ట్విటర్లో పోస్టు చేసింది.
ప్రఖ్యాత టీవీ కార్యక్రమం ‘ఇండియన్ ఐడల్’లో తెలుగు తేజాలు రేవంత్, రోహిత్లు సత్తాచాటిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న జరిగిన తుదిపోరులో యువ గాయకుడు రేవంత్ టైటిల్ విజేతగా నిలిచాడు. రోహిత్ మూడోస్థానం దక్కించుకున్నాడు. రేవంత్ ఇండియన్ ఐడల్ బిరుదుతో పాటు రూ. 25లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. ఇండియన్ ఐడల్గా నిలిచిన రెండో తెలుగు గాయకుడు రేవంత్ కావడం విశేషం.
తాజా వార్తలు
- కువైట్లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..







