ఇండియన్ ఐడల్కు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సన్మానం
- April 12, 2017
ఇండియన్ ఐడల్ సీజన్ 9 టైటిల్ సాధించిన రేవంత్, ఫైనలిస్ట్ రోహిత్లను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ సన్మానించారు. బుధవారం ఆయన నివాసంలో రేవంత్, రోహిత్లను కలిసిన కేటీఆర్ వారికి అభినందనలు తెలియజేశారు. ఇరువురికి శాలువా కప్పి, మెమొంటోతో సన్మానించారు. ఆ తర్వాత వారితో సెల్ఫీలు దిగారు. ఈ ఫొటోలను తెలంగాణ ఐటీశాఖ ట్విటర్లో పోస్టు చేసింది.
ప్రఖ్యాత టీవీ కార్యక్రమం ‘ఇండియన్ ఐడల్’లో తెలుగు తేజాలు రేవంత్, రోహిత్లు సత్తాచాటిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 2న జరిగిన తుదిపోరులో యువ గాయకుడు రేవంత్ టైటిల్ విజేతగా నిలిచాడు. రోహిత్ మూడోస్థానం దక్కించుకున్నాడు. రేవంత్ ఇండియన్ ఐడల్ బిరుదుతో పాటు రూ. 25లక్షల నగదు బహుమతిని గెలుచుకున్నాడు. ఇండియన్ ఐడల్గా నిలిచిన రెండో తెలుగు గాయకుడు రేవంత్ కావడం విశేషం.
తాజా వార్తలు
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!
- యూఏఈలోని ఇండియన్ సిలబస్ స్కూళ్లలో ఆన్లైన్లో ఎగ్జామ్స్..!!









