నైజీరియాలో వైరస్‌ సోకి ఆరోగ్య అత్యవసర పరిస్థితి

- April 13, 2017 , by Maagulf
నైజీరియాలో వైరస్‌ సోకి ఆరోగ్య అత్యవసర పరిస్థితి

- ప్రాణాంతక వైరస్‌ సోకి 489 మంది మృతి 
నైజీరియాలో మెనింజ్కెటిస్‌ (మెదడు వాపు) వ్యాధి తీవ్రరూపం దాల్చింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యాధితో 489 మంది మర ణించారని నైజీరియా ఆరోగ్యశాఖ మంత్రి ఇస్సాక్‌ బుధవారం మీడియాతో ఈ విషయాన్ని చెప్పారు. అయితే దేశంలో దాదాపు మరో 5 వేల మందికీ ఈ ప్రాణాంతక వైరస్‌ సోకినట్టు గుర్తించామని, దీనికి విరుగుడుగా పనిచేసే బెక్స్‌సెరో వ్యాక్సిన్‌ను పంపిణీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటు న్నామని మంత్రి చెప్పారు. దీంతో నైజీరియాలో ఆరోగ్య శాఖ మంత్రి అత్యవ సర పరిస్థితి ప్రకటించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా బెక్స్‌సెరో వ్యాక్సిన్‌ కొరత ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్య క్తం చేశారు. చనిపోయినవారిలో అత్యధికులు జంపారా ప్రాంతానికి చెంది నవారేనని, కత్సిన, కెబ్బీ, నైగర్‌, సొకొటో రాష్ట్రాల్లోనూ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నట్టు వివరించారు. పేద దేశమైన నైజీరియాలో తరచూ ప్రమాదకర వ్యాధులుప్రబలటం, పెద్ద సంఖ్యలో జనం మృత్యువాతపడటం జరుగుతున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com