38 మంది మృతి యెమెన్లో భీకర పోరు
- April 13, 2017
యెమెన్లో సైన్యానికి తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన పోరులో 38 మంది చనిపోయారు. ఓడరేవు నగరం మోచాపై పట్టుకోసం ప్రభుత్వ బలగాలు జరిపిన దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన 38 మంది మృతి చెందినట్టు సమాచారం. యెమెన్లోని అబెద్ రబ్బో హన్సూర్ హడీ ప్రభుత్వానికి, షియా వర్గానికి చెందిన హుతీ తిరుగుబాటుదారులకు మధ్య రెండేళ్లుగా పోరు సాగుతోంది. దేశ రాజధాని సనా సహా కొన్ని ప్రాంతాలు హుతీ తిరుగుబాటు దారుల ఆధీనంలో ఉన్నాయి. వాటిని తిరిగి చేజిక్కించుకునేందుకు పొరుగునే ఉన్న సౌదీ అరేబియా సాయంతో యెమెన్ ప్రభుత్వం పోరాటం సాగిస్తోంది. కాగా, తాజాగా జరిగిన మోచా ఘటనపై ప్రభుత్వ వర్గాలు అధికారికంగా స్పందించటం లేదు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం, ఆర్టీసీ జేఏసీ నేతల మధ్య చర్చలు సఫలం..!
- IPL 2026: గుజరాత్ పై బెంగళూరు ఘన విజయం
- వేసవి సెలవుల్లో విద్యార్థులకు సాఫ్ట్వేర్ కోర్సుల శిక్షణ రోహేలాస్ టెక్ ఆహ్వానం
- మణిపూర్లో ఘర్షణలు..ముగ్గురు మృతి
- పేటీఎంకు ఆర్బీఐ బిగ్ షాక్..
- హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!









