38 మంది మృతి యెమెన్‌లో భీకర పోరు

- April 13, 2017 , by Maagulf
38 మంది మృతి యెమెన్‌లో భీకర పోరు

యెమెన్‌లో సైన్యానికి తిరుగుబాటుదారులకు మధ్య జరిగిన పోరులో 38 మంది చనిపోయారు. ఓడరేవు నగరం మోచాపై పట్టుకోసం ప్రభుత్వ బలగాలు జరిపిన దాడుల్లో ఇరు వర్గాలకు చెందిన 38 మంది మృతి చెందినట్టు సమాచారం. యెమెన్‌లోని అబెద్‌ రబ్బో హన్సూర్‌ హడీ ప్రభుత్వానికి, షియా వర్గానికి చెందిన హుతీ తిరుగుబాటుదారులకు మధ్య రెండేళ్లుగా పోరు సాగుతోంది. దేశ రాజధాని సనా సహా కొన్ని ప్రాంతాలు హుతీ తిరుగుబాటు దారుల ఆధీనంలో ఉన్నాయి. వాటిని తిరిగి చేజిక్కించుకునేందుకు పొరుగునే ఉన్న సౌదీ అరేబియా సాయంతో యెమెన్‌ ప్రభుత్వం పోరాటం సాగిస్తోంది. కాగా, తాజాగా జరిగిన మోచా ఘటనపై ప్రభుత్వ వర్గాలు అధికారికంగా స్పందించటం లేదు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com