నైజీరియాలో వైరస్ సోకి ఆరోగ్య అత్యవసర పరిస్థితి
- April 13, 2017
- ప్రాణాంతక వైరస్ సోకి 489 మంది మృతి
నైజీరియాలో మెనింజ్కెటిస్ (మెదడు వాపు) వ్యాధి తీవ్రరూపం దాల్చింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యాధితో 489 మంది మర ణించారని నైజీరియా ఆరోగ్యశాఖ మంత్రి ఇస్సాక్ బుధవారం మీడియాతో ఈ విషయాన్ని చెప్పారు. అయితే దేశంలో దాదాపు మరో 5 వేల మందికీ ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్టు గుర్తించామని, దీనికి విరుగుడుగా పనిచేసే బెక్స్సెరో వ్యాక్సిన్ను పంపిణీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటు న్నామని మంత్రి చెప్పారు. దీంతో నైజీరియాలో ఆరోగ్య శాఖ మంత్రి అత్యవ సర పరిస్థితి ప్రకటించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా బెక్స్సెరో వ్యాక్సిన్ కొరత ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్య క్తం చేశారు. చనిపోయినవారిలో అత్యధికులు జంపారా ప్రాంతానికి చెంది నవారేనని, కత్సిన, కెబ్బీ, నైగర్, సొకొటో రాష్ట్రాల్లోనూ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నట్టు వివరించారు. పేద దేశమైన నైజీరియాలో తరచూ ప్రమాదకర వ్యాధులుప్రబలటం, పెద్ద సంఖ్యలో జనం మృత్యువాతపడటం జరుగుతున్నది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







