నైజీరియాలో వైరస్ సోకి ఆరోగ్య అత్యవసర పరిస్థితి
- April 13, 2017
- ప్రాణాంతక వైరస్ సోకి 489 మంది మృతి
నైజీరియాలో మెనింజ్కెటిస్ (మెదడు వాపు) వ్యాధి తీవ్రరూపం దాల్చింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యాధితో 489 మంది మర ణించారని నైజీరియా ఆరోగ్యశాఖ మంత్రి ఇస్సాక్ బుధవారం మీడియాతో ఈ విషయాన్ని చెప్పారు. అయితే దేశంలో దాదాపు మరో 5 వేల మందికీ ఈ ప్రాణాంతక వైరస్ సోకినట్టు గుర్తించామని, దీనికి విరుగుడుగా పనిచేసే బెక్స్సెరో వ్యాక్సిన్ను పంపిణీ చేసేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటు న్నామని మంత్రి చెప్పారు. దీంతో నైజీరియాలో ఆరోగ్య శాఖ మంత్రి అత్యవ సర పరిస్థితి ప్రకటించారు. అయితే ప్రపంచ వ్యాప్తంగా బెక్స్సెరో వ్యాక్సిన్ కొరత ఉన్నందున మరణాల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్య క్తం చేశారు. చనిపోయినవారిలో అత్యధికులు జంపారా ప్రాంతానికి చెంది నవారేనని, కత్సిన, కెబ్బీ, నైగర్, సొకొటో రాష్ట్రాల్లోనూ వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నట్టు వివరించారు. పేద దేశమైన నైజీరియాలో తరచూ ప్రమాదకర వ్యాధులుప్రబలటం, పెద్ద సంఖ్యలో జనం మృత్యువాతపడటం జరుగుతున్నది.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







