అద్భుతమైన కళాఖండాలకు నెలవు దుబాయ్ ఎక్సిబిషన్
- April 13, 2017
ప్రపంచ ఆర్ట్ దుబాయ్ మూడవ సీజన్ అమోఘమైన కళాకృతుల సమాహారం ప్రజలు చూసేందుకు బుధవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 15 వ తేదీ వరకు కొనసాగించబడుతుంది. ఈ ప్రదర్శనలో 3,000 పైగా చిత్రాలు, ప్రింట్లు, శిల్పాలు మరియు ఛాయాచిత్రాల సేకరణను ఇక్కడ వీక్షించవచ్చు.ఇక్కడ చిత్రాలను తమ స్వంతం చేసుకోవాలంటే కనీసం 100 డాలర్ల సరసమైన ధర వెచ్చించాల్సి ఉంది. ఈ కార్యక్రమం ఉద్దేశపూర్వకంగా కళాభిమానులు కొరకు కేటాయించబడింది. మొదటిసారి కళాభిమానులు ఆయా చిత్రాలను దక్కించుకోవాలని ఆశ పడితే అందరికీ అందుబాటులో మరియు సరసమైన ధరలలో వాటిని దక్కించుకోవచ్చనే హామీ ఉంది.దుబాయ్ సమాచారం యొక్క విభాగం డైరెక్టర్ జనరల్ షేక్ హషేర్ బిన్ మక్తోయం అల్ మక్తోయం బుధవారం అధికారికంగా ఈ కార్యక్రమం ప్రారంభించించారు 35 కు పైగా అంతర్జాతీయ గ్యాలరీలు యూరోప్, జపాన్, ఉక్రెయిన్ మరియు యునైటెడ్ స్టేట్స్ కి ప్రాతినిధ్యం అంకితమైన 120 కళాకారులు ఔత్సాహిక కళాకారులు ఇందులో తమ చిత్రాలను ప్రదర్శించనున్నారు. ఈ కార్యక్రమంలో మధ్య ప్రాచ్యం నుండి, కళాకారులు పాల్గొంటున్నారు.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







