చిన్నారి అదితి కథ విషాదాంతం

- October 01, 2015 , by Maagulf
చిన్నారి అదితి కథ విషాదాంతం

చిన్నారి అదితి కథ విషాదమయ్యింది. వారం కిందట విశాఖపట్టణం డ్రైనేజీలో పడి కొట్టుకుపోయిన ఆమె మృతదేహం విజయనగరం జిల్లా భోగాపురం సన్‌రే బీచ్‌లో లభించింది. ఏడురోజుల క్రితం ఇదే రోజున ఈ దుర్ఘటన జరిగింది. ఈ రోజు సాయంత్రం భోగాపురం బీచ్‌లో అదితి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు సందేహాల నడుమ ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. పోలీసుల సమాచారంతో ఘటనాస్థలికి అదితి కుటుంబీకులు, బంధువులు చేరుకున్నారు.  మృతదేహంపై ఉన్న చెవిదిద్దులు, మెడలోని తాయత్తు తదితర ఆనవాళ్లతో అదితి భౌతిక కాయాన్ని ఆమె తండ్రి గుర్తించారు. అదితిని విగతజీవిగా చూసిన ఆ కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపించింది. ఏడుస్తూ బంధువులు కుప్పకూలిపోయారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి అదితిని వెదికేందుకు ఖర్చుకు వెనుకాడకుండా ప్రయత్నాలు చేసింది.

యమ్.వాసు దేవ రావు (మాగల్ఫ్  ప్రతినిధి - బహ్రెయిన్). 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com