వర్కర్స్కి మాత్రమే అండ, బాస్లకి కాదు
- October 01, 2015
ఒప్పందాల ప్రకారం కార్మికులకు సెటిల్మెంట్ చేయకుండా, వారిని చిన్న చిన్న లూప్హోల్స్ని అడ్డం పెట్టుకుని వారి జీవితాలతో ఆడుకుంటున్న సంస్థలను ఉపేక్షించబోమని మానవ వనరుల మంత్రిత్వ శాఖ సలహాదారు నసర్ అల్ సది చెప్పారు. కంపెనీలపై వలస కార్మికులు ఫిర్యాదులు చేస్తే, వారి ఫిర్యాదుల్లో నిజాయితీని బట్టి చర్యలుంటాయని అన్నారు. అమ్నెస్టీ ద్వారా 21 వేల మంది వలస కార్మికులు సొంత దేశాలకు తరలి వెళ్ళారన్నారు. అక్టోబర్ 31 వరకూ అమ్నెస్టీ వలస కార్మికులకు అందుబాటులో ఉండనుంది. ఉద్యోగ కల్పనా రంగంలోని ఇబ్బందుల్ని గుర్తించామనీ, వాటిని సరిచేసి ఎలాంటి లోపాలు లేకుండా ఉండేలా చేస్తామన్నారు నసర్ అల్ నది. అమ్మెస్టీ సహాయంతో 14 వేల మందికి పైగా బంగ్లాదేశీయులు స్వదేశానికి వెళ్ళినట్లు బంగ్లాదేశ్ ఎంబసీ చెప్పింది. పాకిస్తాన్కు 4 వేల మంది వెళ్ళగా, సుమారు 3 వేల మంది అమ్నెస్టీకి దరఖాస్తు చేసుకుని ఉన్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..







