కార్నిచ్ లో ప్రారంభమైన జి.సి.సి తీరరక్షణ వారోత్సవం
- April 13, 2017
దోహా:బుధవారం దోహాలోని అల్ బందర్, దోహా కనిచే లో అట్టహాసంగా ప్రారంభమైన జి సి సి తీరరక్షణ వారోత్సవ వేడుకలు పలువుర్నిఅలరిస్తున్నాయి. కోస్ట్ జనరల్ డైరెక్టరేట్ మరియు బోర్డర్ సెక్యూరిటీ నిర్వహణలో "మా లక్ష్యం భద్రత మరియు రక్షణ "అనే అంశంపై ఈ వేడుకలను కొనసాగిస్తున్నారు. జీసీసీ దేశాల తీరదళాల మధ్య పరస్పర సహకారం విస్తరించేందుకు సముద్రంలోకి సురక్షితంగా వెళ్లేవారు కోసం సముద్ర భద్రత అవగాహన పెంచడానికి వేడుకలను అలాగే క్రమంలో జరుపుకుంటారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో డైరెక్టర్ జనరల్, కోస్ట్ జనరల్ డైరెక్టరేట్ బోర్డర్ సెక్యూరిటీ, స్టాఫ్ బ్రిగేడియర్ (నావికాదళం) ఆలీ అహ్మద్ ఆల్-బిడాది మాట్లాడుతూ, జి సి సి తీరరక్షణ వారోత్సవ వేడుకలు పౌరులు మరియు నివాసితులు సముద్ర భద్రతా విధానాలు గురించి అవగాహన పెంచటానికి ఒక గొప్ప అవకాశం అని చెప్పారు.తమ కార్యకలాపాలు ప్రజలకు పరిచయం చేయడం సముద్ర భద్రతా బలోపేతం చేసి సముద్ర వినియోగదారుల జీవితాలను రక్షించడానికి భద్రతా ఏజెన్సీలు చేపట్టిన చర్యలను గూర్చి తెలుసు కొనేందుకు సహాయపడతాయని అన్నారు.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









