మోహన్‌లాల్‌ హీరోగా గిన్నిస్‌ అందుకున్న 'మన్యంపులి'

- April 15, 2017 , by Maagulf
మోహన్‌లాల్‌ హీరోగా గిన్నిస్‌ అందుకున్న 'మన్యంపులి'

మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ హీరోగా నటించిన చిత్రం 'పులి మురుగన్‌'. కేవలం పాతికకోట్లతో దర్శకుడు వైశాఖ్‌ తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది సూపర్‌డూపర్‌ హిట్‌ అయింది. ఇంతకీ విషయమేంటంటే.. ఈ యాక్షన్‌ అడ్వెంచర్‌ ఫిల్మ్‌ ఓ అరుదైన రికార్డ్‌ సాధించింది. ఇటీవలే ఈ మూవీ త్రీడీ వెర్షన్‌ని కేరళలోని తిరువనంతపురంలో ఉండే అడ్లక్స్‌ థియోటర్‌లో దాదాపు 20 వేల మంది వీక్షించారు. ఇలా ఏకంగా ఒకేసారి 20వేల మంది త్రీడీ చిత్రాన్ని వీక్షించటం ప్రపంచంలో ఇదే తొలిసారి. దీంతో గిన్నిస్‌ రికార్డ్‌ వరించింది. 2012 సంవత్సరంలో హాలీవుడ్‌ చిత్రం 'మెన్‌ ఇన్‌ బ్లాక్‌'ను ఆరువేల మంది ప్రేక్షకులు త్రీడీలో వీక్షించారు. ప్రస్తుతం ఆ రికార్డును 'పులి మురుగన్‌' ఊహించని స్థాయిలో వెనక్కి నెట్టేసింది. బాక్సాఫీస్‌ దగ్గరే కాదు రికార్డుల్లోనూ మలయాళ పులి గర్జించిందనమాట!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com