మోహన్లాల్ హీరోగా గిన్నిస్ అందుకున్న 'మన్యంపులి'
- April 15, 2017
మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ హీరోగా నటించిన చిత్రం 'పులి మురుగన్'. కేవలం పాతికకోట్లతో దర్శకుడు వైశాఖ్ తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది సూపర్డూపర్ హిట్ అయింది. ఇంతకీ విషయమేంటంటే.. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ఓ అరుదైన రికార్డ్ సాధించింది. ఇటీవలే ఈ మూవీ త్రీడీ వెర్షన్ని కేరళలోని తిరువనంతపురంలో ఉండే అడ్లక్స్ థియోటర్లో దాదాపు 20 వేల మంది వీక్షించారు. ఇలా ఏకంగా ఒకేసారి 20వేల మంది త్రీడీ చిత్రాన్ని వీక్షించటం ప్రపంచంలో ఇదే తొలిసారి. దీంతో గిన్నిస్ రికార్డ్ వరించింది. 2012 సంవత్సరంలో హాలీవుడ్ చిత్రం 'మెన్ ఇన్ బ్లాక్'ను ఆరువేల మంది ప్రేక్షకులు త్రీడీలో వీక్షించారు. ప్రస్తుతం ఆ రికార్డును 'పులి మురుగన్' ఊహించని స్థాయిలో వెనక్కి నెట్టేసింది. బాక్సాఫీస్ దగ్గరే కాదు రికార్డుల్లోనూ మలయాళ పులి గర్జించిందనమాట!
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







