మోహన్లాల్ హీరోగా గిన్నిస్ అందుకున్న 'మన్యంపులి'
- April 15, 2017మలయాళ సూపర్స్టార్ మోహన్లాల్ హీరోగా నటించిన చిత్రం 'పులి మురుగన్'. కేవలం పాతికకోట్లతో దర్శకుడు వైశాఖ్ తెరకెక్కించిన ఈ చిత్రం గతేడాది సూపర్డూపర్ హిట్ అయింది. ఇంతకీ విషయమేంటంటే.. ఈ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ ఓ అరుదైన రికార్డ్ సాధించింది. ఇటీవలే ఈ మూవీ త్రీడీ వెర్షన్ని కేరళలోని తిరువనంతపురంలో ఉండే అడ్లక్స్ థియోటర్లో దాదాపు 20 వేల మంది వీక్షించారు. ఇలా ఏకంగా ఒకేసారి 20వేల మంది త్రీడీ చిత్రాన్ని వీక్షించటం ప్రపంచంలో ఇదే తొలిసారి. దీంతో గిన్నిస్ రికార్డ్ వరించింది. 2012 సంవత్సరంలో హాలీవుడ్ చిత్రం 'మెన్ ఇన్ బ్లాక్'ను ఆరువేల మంది ప్రేక్షకులు త్రీడీలో వీక్షించారు. ప్రస్తుతం ఆ రికార్డును 'పులి మురుగన్' ఊహించని స్థాయిలో వెనక్కి నెట్టేసింది. బాక్సాఫీస్ దగ్గరే కాదు రికార్డుల్లోనూ మలయాళ పులి గర్జించిందనమాట!
తాజా వార్తలు
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్ను కలిసిన భారత రాయబారి
- ఖతార్లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..
- మీ వాట్సాప్ గ్రీన్ కలర్లోకి మారిందా?
- టీ20 వరల్డ్ కప్ కోసం భారత జట్టును ప్రకటించిన BCCI
- మే నెలలో పెరగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు