25 మంది మృతి ఇరాన్‌లో వరదలు

- April 15, 2017 , by Maagulf
25 మంది మృతి ఇరాన్‌లో వరదలు

ఇరాన్‌ పశ్చిమోత్తర దిశలోని ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. వరద ప్రవాహంలో కొట్టుకొనిపోయి 25 మంది మృతి చెందగా, మరో 16 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఇరాన్‌ అత్యవసర సేవల విభాగం తెలిపిన వివరాల ప్రకారం...నాలుగు ప్రావిన్స్‌ల్లో వరద ఉధృతి కొనసాగుతున్నది. వరద ప్రవాహంలో పలు ఇండ్లు కొట్టుకునిపోయాయి. విద్యుత్‌ స్తంభాలు, చెట్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపైకీ వరద నీరు భారీగా వచ్చి చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com