25 మంది మృతి ఇరాన్లో వరదలు
- April 15, 2017
ఇరాన్ పశ్చిమోత్తర దిశలోని ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. వరద ప్రవాహంలో కొట్టుకొనిపోయి 25 మంది మృతి చెందగా, మరో 16 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఇరాన్ అత్యవసర సేవల విభాగం తెలిపిన వివరాల ప్రకారం...నాలుగు ప్రావిన్స్ల్లో వరద ఉధృతి కొనసాగుతున్నది. వరద ప్రవాహంలో పలు ఇండ్లు కొట్టుకునిపోయాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపైకీ వరద నీరు భారీగా వచ్చి చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
తాజా వార్తలు
- కొత్త వాటర్ఫ్రంట్ గమ్యస్థానం నామీ బీచ్..!!
- దుబాయ్ లో స్టంట్స్ చేసిన మోటార్ సైకిల్ సీజ్..!!
- 18.5 గంటల సంక్లిష్ట ఆపరేషన్.. ఫలించిన సౌదీ సర్జన్ల కృషి..!!
- అన్ని తరాలకూ వ్యాక్సిన్లు పనిచేస్తాయి..!!
- ఎయిర్ స్పెస్ ను తిరిగి తెరిచిన కువైట్..!!
- కజకిస్తాన్ ప్రధానమంత్రితో సయ్యద్ థెయాజిన్ భేటీ..!!
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం









