25 మంది మృతి ఇరాన్లో వరదలు
- April 15, 2017
ఇరాన్ పశ్చిమోత్తర దిశలోని ప్రాంతాల్లో వరదలు పోటెత్తాయి. వరద ప్రవాహంలో కొట్టుకొనిపోయి 25 మంది మృతి చెందగా, మరో 16 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఇరాన్ అత్యవసర సేవల విభాగం తెలిపిన వివరాల ప్రకారం...నాలుగు ప్రావిన్స్ల్లో వరద ఉధృతి కొనసాగుతున్నది. వరద ప్రవాహంలో పలు ఇండ్లు కొట్టుకునిపోయాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలమట్టమయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. రోడ్లపైకీ వరద నీరు భారీగా వచ్చి చేరడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్, కువైట్, ఖతార్, జోర్డాన్, ఒమాన్పై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన యూఏఈ
- మైసూరులో అధికారిక లాంఛనాలతో జానకమ్మ అంత్యక్రియలు పూర్తి
- ముంబై ఆసుపత్రిలో పవన్ కల్యాణ్ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
- ఇరాన్ క్షిపణి, డ్రోన్ దాడులను తిప్పికొట్టిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- ఈజిప్ట్లో యూఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్..
- తిరుమల అక్టోబర్ దర్శన టికెట్లు బుకింగ్ తేదీలు ఇవే
- బ్రిటన్లో బహ్రెయిన్ ఈడీబీ టూర్ సక్సెస్..!!
- ఖతార్లో చిన్నారి సహా ముగ్గురికి గాయాలు..!!
- పది మంది భారతీయ సిబ్బంది సేఫ్..రక్షించిన ఒమన్..!!
- సౌదీలో 15,430 మంది అక్రమ వలసదారులు అరెస్ట్..!!







