నగదు ఎక్సేంజ్ రేట్లను పెంచి. షాక్ ఇఛ్చిన ఎక్సేంజ్ హౌజ్లు
- April 18, 2017
విదేశాలకు వెళ్లి కష్టపడి నాలుగు రాళ్ళు సంపాదించుకుంటున్నవారికి ఎక్సేంజ్ హౌజ్లు షాకిస్తున్నాయి. యూఏఈలో నివసిస్తున్న వారు సంపాదించిన నగదును తమ స్వదేశాలకు పంపుకోవడం కాస్ట్లీగా మారుతోంది. ఈ వారంలో ఎక్సేంజ్ ఏజెన్సీలు రెమిటెన్స్లపై వసూలు చేసే ఛార్జీలను పెంచినట్లు ప్రకటించాయి. ఏప్రిల్ 15 నుంచి బ్యాంకు ట్రాన్స్ఫర్లకు డీహెచ్2(రూ.35.12) వరకు వసూలు చేస్తున్నట్లు పేర్కొన్నాయి. అదేవిధంగా కొన్ని ఎక్సేంజ్లపై కూడా ఫీజులను ఏప్రిల్ మొదటివారం నుంచి పెంచినట్లు తెలిపాయి. ఒక్కో లావాదేవీపై వేసే సర్వీసు ఛార్జీల రేట్లను కూడా పెంచినట్లు ఆ ఏజెన్సీలు తెలిపాయి. ఛార్జీలను పెంచిన లీడింగ్ ఎక్సేంజ్ హౌజ్లన్నీ, ఫారిన్ ఎక్సేంజ్ అండ్ రెమిటెన్స్ గ్రూప్లో సభ్యులు. ఇది యూఏఈలోని మనీ ఎక్సేంజ్ హౌజ్లకు అధికారిక ప్లాట్ఫామ్. అయితే ఈ నిర్ణయం తమది కాదని ఎఫ్ఈఆర్జీ ఛైర్మన్ మహ్మద్ అల్ అన్సారీ చెప్పారు. స్వల్పంగా ఛార్జీలు పెంచుకోమనే సూచించామని, వాటిపై తుది నిర్ణయం సభ్యులే తీసుకున్నట్లు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









