ఆచూకీ లేని భారతీయ కార్మికుడు శలాలహ్ మసీదు వద్ద కనుగొన్నారు
- April 18, 2017
ఘాల శిబిరం నుండి రెండు నెలల క్రితం తప్పిపోయిన ఓ భారతీయ కార్మికుడిని శలాలహ్ మసీదు వద్ద అనూహ్యంగా కనుగొన్నారు. మస్కట్ డైలీ పత్రికలో మార్చి 6 న ఈ కార్మికుడు గురించి ప్రచురించారు. అశుతోష్ ధాల్ అనే 28 ఏళ్ళ యువకుడు భారతదేశంలో తూర్పు రాష్ట్రమైన ఒడిషాకు చెందినవాడు. ఎక్కడకు వెళ్లాడని అందరు భావిస్తున్న సమయంలో అకస్మాత్తుగా శలాలః ఒక మసీదు వద్ద దర్శనమిచ్చారు. అశుతోష్ ధాల్ తో పాటు పనిచేసే సంస్థకు చెందిన కొందరు కార్మికులు అతన్ని గుర్తించారు. మస్కట్ లో ఉంటున్న అశుతోష్ ధాల్ యొక్క స్నేహితుడు వినోద్ బిహారీ పరిడను సంప్రదించారు. పరిడ మస్కట్ లో ఉన్న భారత రాయబార కార్యాలయం ఇతర సంస్థల ద్వారా ఈ కేసు విషయమై ఆరా తీస్తున్నారు. ఈ సందర్భంగా పరిడ మస్కట్ డైలీతో మాట్లాడుతూ, తానూ అశుతోష్ పోలిక ఉన్న ఒక వ్యక్తి గురించి ఒక కార్మికుని ద్వారా సమాచారం అందుకొన్నానని , నేను వెంటనే వాట్స్ అప్ ద్వారా ఆ వ్యక్తి ఫోటో పంపమని ఆ కార్మికుదీని కోరినట్లు తెలిపానన్నారు. ఫోటో వచ్చిన వెంటనే ఆ వ్యక్తిని పరిశీలనగా చూస్తే ఆ వ్యక్తిని నేను గుర్తించాను అతనే అశుతోష్ ధాల్ నేను అశుతోష్ తో మాట్లాడాలి ఫోన్ అతనికి అందచేయమని ఆ కార్మికుడిని అడిగి నేను ధాల్ తో మాట్లాడాను. తానూ బాగానే ఉన్నట్లు పేర్కొంటూ. అయితే చాలా ఒత్తిడికి గురైనట్లు తెలిపాడన్నారు. మస్కట్ డైలీ అశుతోష్ ధాల్ ను సంప్రదించగా, తనను కొంతమంది బెదిరించారని దాంతో ఒక బస్సుఎక్కి ఆ నగరం వదిలివచ్చినట్లు పేర్కొన్నాడు.ఆ తర్వాత శలాలః వచ్చి సరైన ఆహారం లేకుండా రోజులు గడిపినట్లు చెబుతూ ఆ తర్వాత తానూ ఒక మసీదు వద్ద ఆశ్రయం పొందుతున్నట్లు చెప్పారు. నేను భారతదేశం తిరిగి వెళ్లిపోవాలనుకొంటున్నాను మరియు నా కుటుంబంను కలవడానికి ఎంతో ఆశపడుతున్నట్లు అశుతోష్ ధాల్ తెలిపారు. అశుతోష్ ధాల్ స్నేహితుడు భారత విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్, సహాయం కోరుతూ ట్వీట్ చేసినట్లు తెలిపారు. మరియు మస్కట్ భారత ఎంబసీ లో ఈ ఫిర్యాదు నమోదైంది.
తాజా వార్తలు
- ఒమన్లో విషాదం.. ఇంటి బావిలో పడి చిన్నారి మృతి..!!
- భారతీయులకు సౌదీ ‘వీసా ప్యాకేజీ’.. 48 గంటల్లో ఈ-టూరిస్ట్ వీసా..!!
- బహ్రెయిన్లో ప్లాస్టిక్ బ్యాగులపై నిషేధం.. కీలక ఆదేశాలు జారీ..!!
- కువైట్లో రెసిడెన్సీ నిబంధనల ఉల్లంఘన.. కొత్త కేసుల్లో పెరుగుదల..!!
- ఖతార్లో ట్రాఫిక్ జరిమానాలు ఏడాది దాటితే ప్రాసిక్యూషన్ కు రిఫర్..!!
- యూఏఈ-భారత్ విమాన టికెట్ల ధరలు.. 30% వరకు తగ్గింపు..!!
- సీఎం చంద్రబాబు కేబినెట్ భేటీకి డుమ్మా కొట్టిన మంత్రులు
- చరిత్రలో తొలిసారి.. భారత్లో ‘బిగ్ బాష్ లీగ్’ మ్యాచ్..
- గ్లోబల్ 'ఓపెన్ కాల్' ప్రకటించిన ఎమార్
- స్వదేశీ రక్షణ సామర్థ్యాలకు ప్రపంచ స్థాయి గుర్తింపు: మోదీ







