నెలరోజుల పాటు సందడి చేయనున్న ప్రవాసీయ భారత క్రికెట్ టోర్నమెంట్
- April 19, 2017
మనామా: భారతదేశంలో అంతర్జాతీయ ఐ ప్ ఎల్ క్రికెట్ పోటీలు సందడి చేస్తుండగా, ప్రవాస భారతీయులు మరోవైపు ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ తామేమి తీసిపోమన్నట్లుగా నిరూపిస్తున్నారు. భారత క్లబ్ భారతీయ ప్రవాసీయులు సెవెన్-ఎ-సైడ్ సాఫ్ట్ బాల క్రికెట్ టోర్నమెంట్ 2017 నెలరోజుల టోర్నమెంట్ ప్రారంభంకానుంది. ప్రారంభోత్సవ వేడుక గుదైబియా లోని ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంపై క్లబ్ సభ్యులు, అతిథులు మరియు టోర్నమెంటులో పాల్గొనే జట్లు హాజరయ్యారు. గ్రూప్ దశలో ప్రారంభ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బి సి జి క్రికెట్ జట్టు 5 ఓవర్ల ఒక బంతికి కేవలం17 పరుగులను చేయగా, ఆ లక్ష్యాన్ని చేధించడానికి సూపెర్నేట్ కార్గో బ్యాటింగ్ కు దిగి పరుగుల వర్షం కురిపించారు రెండు ఓవర్లు పూర్తి కాకుండానే ప్రత్యర్థి స్కోర్ చేసిన మొత్తాన్ని దాటివేశారు..ఒక ఓవర్ మూడు బంతులతో విజయలక్ష్యాన్ని చేరుకొన్నారు. ఆ తర్వాత జరిగిన రెండవ మ్యాచ్ వినాల్ క్రికెట్ క్లబ్ , బేహారిన్ బ్లూస్ జట్ల మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బేహారిన్ బ్లూస్ 5 ఓవర్ల మూడు బంతులతో 27 పరుగులు చేశారు. ఆ లక్ష్యాన్ని చేధించేందుకు వినాల్ క్రికెట్ క్లబ్ ఆటగాళ్లు 5 ఓవర్ల ఒక్క బంతికె 30 పరుగులు స్కోరు చేసి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించారు.
తాజా వార్తలు
- డిగ్రీ అర్హతతో 216 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు..
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!









