నెలరోజుల పాటు సందడి చేయనున్న ప్రవాసీయ భారత క్రికెట్ టోర్నమెంట్
- April 19, 2017
మనామా: భారతదేశంలో అంతర్జాతీయ ఐ ప్ ఎల్ క్రికెట్ పోటీలు సందడి చేస్తుండగా, ప్రవాస భారతీయులు మరోవైపు ఒక క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ తామేమి తీసిపోమన్నట్లుగా నిరూపిస్తున్నారు. భారత క్లబ్ భారతీయ ప్రవాసీయులు సెవెన్-ఎ-సైడ్ సాఫ్ట్ బాల క్రికెట్ టోర్నమెంట్ 2017 నెలరోజుల టోర్నమెంట్ ప్రారంభంకానుంది. ప్రారంభోత్సవ వేడుక గుదైబియా లోని ఆవరణలో జరిగింది. ఈ కార్యక్రమంపై క్లబ్ సభ్యులు, అతిథులు మరియు టోర్నమెంటులో పాల్గొనే జట్లు హాజరయ్యారు. గ్రూప్ దశలో ప్రారంభ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన బి సి జి క్రికెట్ జట్టు 5 ఓవర్ల ఒక బంతికి కేవలం17 పరుగులను చేయగా, ఆ లక్ష్యాన్ని చేధించడానికి సూపెర్నేట్ కార్గో బ్యాటింగ్ కు దిగి పరుగుల వర్షం కురిపించారు రెండు ఓవర్లు పూర్తి కాకుండానే ప్రత్యర్థి స్కోర్ చేసిన మొత్తాన్ని దాటివేశారు..ఒక ఓవర్ మూడు బంతులతో విజయలక్ష్యాన్ని చేరుకొన్నారు. ఆ తర్వాత జరిగిన రెండవ మ్యాచ్ వినాల్ క్రికెట్ క్లబ్ , బేహారిన్ బ్లూస్ జట్ల మధ్య జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన బేహారిన్ బ్లూస్ 5 ఓవర్ల మూడు బంతులతో 27 పరుగులు చేశారు. ఆ లక్ష్యాన్ని చేధించేందుకు వినాల్ క్రికెట్ క్లబ్ ఆటగాళ్లు 5 ఓవర్ల ఒక్క బంతికె 30 పరుగులు స్కోరు చేసి ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించారు.
తాజా వార్తలు
- దుబాయ్ పేలుళ్లపై తప్పుడు కథనం ప్రచురణ.. జర్నలిస్టు, బృందానికి యూఏఈ సమన్లు
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







