కువైట్ లో ఘనంగా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- April 20, 2017
కువైట్ లోని SVS Cargo ఆఫీసు ప్రాంగణంలో తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు మరియు నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు 68వ జన్మదిన వేడుకలను తెలుగు దేశం -కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈకార్యక్రమం లో ప్రసంగించిన తెలుగుదేశం-కువైట్ అధ్యక్షులు కుదరవల్లి సుధాకరరావు ntr ఆదర్శంగా మరియు చంద్రబాబు నాయుడు స్ఫూర్తి తో కువైట్ లో పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని, మన రాష్ట్రం కనీసం రాజధాని కూడా లేకుండా విడిపోతే చంద్రబాబు పరిపాలన చాతుర్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ఆయన చేస్తున్న కృషి మరువలేనిదని తెలిపారు.
అలాగే ఇంద్రాణి ఛారిటబుల్ ట్రస్ట్ అధినేత ఇంద్ర కుమార్ రాజు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గా మన అదృష్టం అని ఆయన రాష్ట్రాన్ని చరిత్ర పుటల్లో అగ్రస్థానంలో నిలుపుతారని 2019 లో కూడా ఆయననే ముఖ్యమంత్రి గా చేయడానికి మనందరం కృషి చేయాలని వచ్చిన సభ్యులను కోరారు. ఈ కార్యక్రమం లో ప్రవాస కాపు బలిజ సేవా సంఘం అధ్యక్షులు మరియు తెలుగు కువైట్ వెల్ఫేర్ కో.ఆర్డినేటర్ మురళి మరియు P.R.Oఈశ్వర్ నాయుడు మరియు మీడియా కో ఆర్డినేటర్ రవికుమార్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను వివరించారు.
ఈ కార్యక్రమం లో గల్ఫ్ వైడ్ నందమూరి ఫ్యాన్స్ అధ్యక్షులు వేగి వెంకటేష్ మరియు నారా లోకేష్ సేవా సమితి అధ్యక్షులు పట్టాభిరామ మరియు ఆంధ్రాయూత్ కార్యవర్గ సభ్యులు మరియు తెలుగు దేశంకువైట్ సభ్యులు సుబ్బారెడ్డి,ముస్తాక్,విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.







తాజా వార్తలు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!
- సోషల్ మీడియాను దుర్వినియోగం..నలుగురు అరెస్టు..!!
- యూఏఈ: ప్రయాణికులకు ఓవర్స్టే జరిమానాల మాఫీ
- యూఏఈలో విద్యాసంస్థలకు మార్చి 9 నుంచి స్ప్రింగ్ బ్రేక్ సెలవులు
- నెల్లూరు నుంచి విదేశాలకు.. తీగలాగితే డొంక కదులుతోంది..!









