కొంపల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ ప్రారంభం
- April 21, 2017
తెలంగాణ రాష్ట్ర సమితి 16వ ప్లీనరీ హైదరాబాద్లోని కొంపల్లిలో ఘనంగా ప్రారంభమైంది. ముందుగా తెరాస అధ్యక్షుడు కేసీఆర్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఆనంతరం కేసీఆర్ ప్రారంభోపన్యాసంతో ప్లీనరీ ప్రారంభమైంది. తెరాస అధికారంలోకి వచ్చాక జరుగుతున్న మూడో ప్లీనరీ ఇది. రాష్ట్రంలో పలు రాజకీయ పరిణామాల నడుమ, ఎన్నికలకు మరో రెండేళ్ల గడువు మాత్రమే మిలిగి ఉన్న సమయంలో జరుగుతున్న ఈ ప్లీనరీకి పార్టీ ఎంతో ప్రాధాన్యమిస్తోంది. మూడేళ్ల పాలనను సమీక్షించడంతో పాటు వచ్చే రెండేళ్ల కార్యాచరణను పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్లీనరీ ప్రాంగణంలో ప్రకటించనున్నారు. మొదట్లో ప్లీనరీ, తెరాస ఆవిర్భావ దినోత్సవాలు ఒకేరోజు జరిగేవి. పార్టీ కార్యక్రమాల విస్తృతిలో భాగంగా ప్లీనరీ, సభను విడివిడిగా జరుపుతున్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 2 27న వరంగల్లో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. దానికి సన్నాహంగా ప్లీనరీ నిర్వహించాలని తెరాస నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









