తొలిసారిగా హైదరాబాద్ మెట్రోలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి చిత్రం అఖిల్దే
- April 21, 2017
'మనం' విజయంతో విక్రమ్ కుమార్పై భరోసా ఉంచి అఖిల్ సెకండ్ మూవీ బాధ్యతను అప్పగించాడు నాగార్జున. ఆరంభానికి ముందే ఓ అరుదైన రికార్డును ఈ సినిమా అందుకోవడం విశేషం. అఖిల్ హీరోగా రూపొందుతున్న సెకండ్ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తెలుగులో ఎవరూ ఇంతవరకూ టచ్ చేయని కొత్త జానర్లో ఈ సినిమా ఉండబోతోందంటున్నారు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్కు ఎంతో ఇంపార్టెన్స్ ఉందట. దీంతో మొదటగా ఈ యాక్షన్ సన్నివేశాలే చిత్రీకరిస్తున్నారు. ఇక రీసెంట్గా '24' సినిమాలో విక్రమ్ కుమార్ చిత్రీకరించిన ట్రైన్ ఫైట్స్ ఆ సినిమాకు హైలైట్గా నిలచాయి. దీంతో అఖిల్ మూవీలోనూ ఓ ట్రైన్ ఫైట్ను ప్లాన్ చేశాడు విక్రమ్ కుమార్. ఇప్పుడీ సీన్స్తో అఖిల్ మూవీ ఓ అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకోవడం విశేషం. అఖిల్ సెకండ్ మూవీకి సంబంధించిన ట్రైన్ సీన్స్ను హైదరాబాద్ మెట్రో రైల్లో చిత్రీకరించారు. ఈ రిస్కీ ఎపిసోడ్కి 'బాబ్ బ్రౌన్' యాక్షన్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ట్రయల్ రన్ మినహా ఇంకా ప్రారంభం కాని హైద్రాబాద్ మెట్రో రైల్లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రంగా అఖిల్ సినిమా అరుదైన రికార్డును అందుకుంది.
షూటింగ్కి అనుమతి ఇచ్చిన మెట్రో మేనేజ్ మెంట్కి ధన్యవాదాలు తెలిపిన అఖిల్.. మెట్రో ట్రైన్లో నుంచి చూస్తుంటే, హైదరాబాద్ మరింత అందంగా కనిపిస్తోందని అన్నాడు. మరి.. ఆల్రెడీ అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి విజయాన్ని అందించిన విక్రమ్ కుమార్..
అఖిల్ మూవీతో మరో సక్సెస్ను అందిస్తాడేమో చూడాలి..!
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







