తొలిసారిగా హైదరాబాద్ మెట్రోలో షూటింగ్ జరుపుకుంటున్న తొలి చిత్రం అఖిల్దే
- April 21, 2017
'మనం' విజయంతో విక్రమ్ కుమార్పై భరోసా ఉంచి అఖిల్ సెకండ్ మూవీ బాధ్యతను అప్పగించాడు నాగార్జున. ఆరంభానికి ముందే ఓ అరుదైన రికార్డును ఈ సినిమా అందుకోవడం విశేషం. అఖిల్ హీరోగా రూపొందుతున్న సెకండ్ మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. తెలుగులో ఎవరూ ఇంతవరకూ టచ్ చేయని కొత్త జానర్లో ఈ సినిమా ఉండబోతోందంటున్నారు. ఈ మూవీలో యాక్షన్ సీన్స్కు ఎంతో ఇంపార్టెన్స్ ఉందట. దీంతో మొదటగా ఈ యాక్షన్ సన్నివేశాలే చిత్రీకరిస్తున్నారు. ఇక రీసెంట్గా '24' సినిమాలో విక్రమ్ కుమార్ చిత్రీకరించిన ట్రైన్ ఫైట్స్ ఆ సినిమాకు హైలైట్గా నిలచాయి. దీంతో అఖిల్ మూవీలోనూ ఓ ట్రైన్ ఫైట్ను ప్లాన్ చేశాడు విక్రమ్ కుమార్. ఇప్పుడీ సీన్స్తో అఖిల్ మూవీ ఓ అరుదైన రికార్డును కూడా సొంతం చేసుకోవడం విశేషం. అఖిల్ సెకండ్ మూవీకి సంబంధించిన ట్రైన్ సీన్స్ను హైదరాబాద్ మెట్రో రైల్లో చిత్రీకరించారు. ఈ రిస్కీ ఎపిసోడ్కి 'బాబ్ బ్రౌన్' యాక్షన్ డైరెక్టర్గా వ్యవహరించాడు. ట్రయల్ రన్ మినహా ఇంకా ప్రారంభం కాని హైద్రాబాద్ మెట్రో రైల్లో షూటింగ్ జరుపుకున్న తొలి చిత్రంగా అఖిల్ సినిమా అరుదైన రికార్డును అందుకుంది.
షూటింగ్కి అనుమతి ఇచ్చిన మెట్రో మేనేజ్ మెంట్కి ధన్యవాదాలు తెలిపిన అఖిల్.. మెట్రో ట్రైన్లో నుంచి చూస్తుంటే, హైదరాబాద్ మరింత అందంగా కనిపిస్తోందని అన్నాడు. మరి.. ఆల్రెడీ అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి విజయాన్ని అందించిన విక్రమ్ కుమార్..
అఖిల్ మూవీతో మరో సక్సెస్ను అందిస్తాడేమో చూడాలి..!
తాజా వార్తలు
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం
- సింగర్ మంగ్లీ పై కేసు నమోదు..









