మొబైల్ ఫోన్ తో విద్యార్థి తలపై కొట్టి ఉద్యోగం పోగొట్టుకొన్న ఉపాధ్యాయుని వైనం
- April 22, 2017
మనామ: రాజ్యంలోని ఒక ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని ఉపాధ్యాయుడు తలపై మొబైల్ ఫోన్ తో బలంగా మోదాడు. దాంతో ఆ విద్యార్థి తలకు సెంటీమీటర్ పొడవు మేర గాయం ఏర్పడింది. బాలుడిని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, ఐదవ తరగతి చదువుతున్న ఆ బాలుడు సోషల్ మీడియా వేదికలపై తనకు జరిగిన సంఘటన గురించి ఒక వీడియో సందేశాన్ని పోస్ట్ చేశాడు, ఇది వైరల్ గా తక్షణమే మారింది. ఈ సంఘటన ఫలితంగా, ఒక అరబ్ జాతీయుడైన ఆ ఉపాధ్యాయుడిపై విద్య మంత్రిత్వశాఖ స్పందించి ఆ సంఘటనపై విచారణ జరిపించిన తర్వాత ఆ ఆరోపణ వాస్తవమని గుర్తించడంతో ఆ ఉపాధ్యాయుడిపై అధికారులు చర్యలు తీసుకొన్నారు. తన కోపం కారణంగా శాశ్వతంగా ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఆన్లైన్లో పోస్ట్ చేసిన వీడియో ప్రకారం, ఈ సంఘటన మంగళవారం జరిగింది, బాలుడు మరియు అతని తోటి విద్యార్ధులు దోహార్ ఆరాడ్ పార్క్ మరియు ముహారక్లోని సహజ అభయారణ్యంలకు పాఠశాల విహారయాత్రకు వెళ్లారు.వీడియో ఫుటేజ్ లో చూపినట్లుగా ఆ బాలుడు తన తండ్రికి 'హాయ్' అని చెప్పినప్పుడు, గురువు ఆమోదించక మొబైల్ ఫోన్ తో తలపై కొట్టినట్లు ఆ బాలుడి సాక్ష్యం రికార్డ్ కాబడింది." నేనుఏద్వడం ప్రారంభించాను మరియు మరొక గురువు వచ్చి రక్తంతో ఉన్ననా తల మరియు ముఖం కడగడం జరిగిందని " ఆ బాలుడు పేర్కొన్నాడు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









