దుబాయ్ లో బాహుబలి సందడి

- April 25, 2017 , by Maagulf
దుబాయ్ లో బాహుబలి సందడి

దుబాయ్ మళ్ళీ మరో సంచలనానికి కేంద్రమయింది. బాహుబలి తారలు ప్రభాస్, రానా, అనుష్క, దర్శకుడు రాజమౌళి మరియు మెగా నిర్మాత శోభు యార్లగడ్డ బాహుబలి-2 ప్రమోషన్స్ కు గాను దుబాయ్ విచ్చేసారు. ఈ సందర్భంగా తమ అభిమానులని కలుసుకోటానికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని చిత్ర యూనిట్ మాగల్ఫ్ కు తెలియజేసారు. సాయంత్రం నాలుగు గంటలకు విలేఖరుల సమావేశం లో పాల్గొని 7 గంటల 30 నిమిషాలకు 'సిటీ వాక్' యందు గల రాక్సీ సినిమాస్ లో ప్రీమియర్ షో కు విచ్చేసి అభిమానులను కలుస్తారు అని చిత్ర డిస్ట్రిబ్యూటర్ మను మాగల్ఫ్ కు తెలియజేసారు. 'కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు' అనే రహస్యం తెలుసుకోటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులను కలిసి తమతో సినిమా చూసే అవకాశాన్ని కల్పించారు చిత్ర డిస్ట్రిబ్యూటర్లు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com