దుబాయ్ లో బాహుబలి సందడి
- April 25, 2017
దుబాయ్ మళ్ళీ మరో సంచలనానికి కేంద్రమయింది. బాహుబలి తారలు ప్రభాస్, రానా, అనుష్క, దర్శకుడు రాజమౌళి మరియు మెగా నిర్మాత శోభు యార్లగడ్డ బాహుబలి-2 ప్రమోషన్స్ కు గాను దుబాయ్ విచ్చేసారు. ఈ సందర్భంగా తమ అభిమానులని కలుసుకోటానికి వచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందని చిత్ర యూనిట్ మాగల్ఫ్ కు తెలియజేసారు. సాయంత్రం నాలుగు గంటలకు విలేఖరుల సమావేశం లో పాల్గొని 7 గంటల 30 నిమిషాలకు 'సిటీ వాక్' యందు గల రాక్సీ సినిమాస్ లో ప్రీమియర్ షో కు విచ్చేసి అభిమానులను కలుస్తారు అని చిత్ర డిస్ట్రిబ్యూటర్ మను మాగల్ఫ్ కు తెలియజేసారు. 'కట్టప్ప బాహుబలి ని ఎందుకు చంపాడు' అనే రహస్యం తెలుసుకోటానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులను కలిసి తమతో సినిమా చూసే అవకాశాన్ని కల్పించారు చిత్ర డిస్ట్రిబ్యూటర్లు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ లో క్వార్టర్స్కు దూసుకెళ్లిన పీవీ సింధు!
- పూరీ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరు మృతి
- ‘జగన్ 2.0 సూపర్ యాప్’ ఆవిష్కరణ
- అరేబియా టాప్-100 సీఈఓల జాబితాలో 8 మంది కువైటీలు..!!
- నకిలీ ట్రావెల్ ఆఫర్లు, AI స్కామ్లపై యూఏఈ అలెర్ట్..!!
- మత విద్వేష వ్యాఖ్యలు.. మహిళకు నెల రోజుల జైలు శిక్ష..!!
- బెలారస్లో ఒమన్ రాజవంశ సంపద ప్రదర్శన ప్రారంభం..!!
- ఫాదర్ అమీర్ కు ఇండియన్ కమ్యూనిటీ ఘన నివాళి..!!
- రక్షణ సహకారంపై సౌదీ-అమెరికా కీలక చర్చలు..!!
- సినిమా టికెట్ ధరల పెంపు..ఏపీలో రానున్న కొత్త విధానం







