అవార్డుకే నిండుదనం వచ్చింది అని చెప్పిన చిరంజీవి

- April 26, 2017 , by Maagulf
అవార్డుకే నిండుదనం వచ్చింది అని చెప్పిన చిరంజీవి

కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు ప్రతిష్టాత్మక దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డ్‌ ప్రకటించిన సందర్భంగా మంగళవారం ఉదయం మెగాస్టార్‌ చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి పూల బొకేతో అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 'నాకు విశ్వనాథ్‌గారి ఉన్న అనుబంధం నటుడు, దర్శకుడు అనే కాకుండా కుటుంబపరమైంది కూడా. ఆయనకు ఈ అవార్డ్‌ రావడం చాలా గర్వంగా ఉంది. మాటల్లో చెప్పలేని అనుభూతికి లోనవుతన్నా.అవార్డు రావాల్సిన సమయంలో వచ్చిందా, లేదా అనే దానిపై ఇప్పుడు మాటలు అనవసరం. నిజానికి ఈ అవార్డ్‌ ఎప్పుడో ఆయనకు రావాల్సింది. కానీ కాస్త ఆలస్యమైనా ఇప్పుడు ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. విశ్వనాథ్‌గారికి దాదాసాహెబ్‌ ఫాల్లే అవార్డు రావడంతో ఆ అవార్డుకే నిండుదనం వచ్చింది. ఈ సందర్భంగా ఆయనకు మనస్పూర్తిగా శుభాభినందనలు తెలుపుతున్నా. ఎప్పటికీ ఆయన ఆశీస్సులు కోరే మనిషిని' అని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com