బాహుబలి టీం తో ఎమిరేట్స్ దురుసు ప్రవర్తన
- April 26, 2017
ఇటీవల బాహుబలి చిత్ర బృందం ప్రచార కార్యక్రమం నిమిత్తం ప్రభాస్, అనుష్క, రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. కార్యక్రమం అనంతరం వీరంతా దుబాయ్ నుంచి హైదరాబాద్కు ఎమిరేట్స్ విమానంలో బయలుదేరారు. వారంతా ఎయిర్పోర్ట్ గేట్ వద్దకు చేరుకోగానే విమాన సిబ్బంది చిత్రబృందంతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
‘ఎమిరేట్స్ ఈకే526 విమానంలో హైదరాబాద్ బయలుదేరాం. గేట్ వద్ద ఎయిర్లైన్స్ సిబ్బంది మాతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. అందులో ఓ సిబ్బంది మాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్లు అనిపించింది. నేను తరచూ ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తుంటాను కానీ ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం 8000 తెరల్లో బాహుబలి-ది కన్క్లూజన్’ విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









