బాహుబలి టీం తో ఎమిరేట్స్ దురుసు ప్రవర్తన
- April 26, 2017
ఇటీవల బాహుబలి చిత్ర బృందం ప్రచార కార్యక్రమం నిమిత్తం ప్రభాస్, అనుష్క, రాజమౌళి, నిర్మాత శోభు యార్లగడ్డ తదితరులు దుబాయ్ వెళ్లిన సంగతి తెలిసిందే. కార్యక్రమం అనంతరం వీరంతా దుబాయ్ నుంచి హైదరాబాద్కు ఎమిరేట్స్ విమానంలో బయలుదేరారు. వారంతా ఎయిర్పోర్ట్ గేట్ వద్దకు చేరుకోగానే విమాన సిబ్బంది చిత్రబృందంతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. ఈ విషయాన్ని బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ట్విటర్ ద్వారా వెల్లడించారు.
‘ఎమిరేట్స్ ఈకే526 విమానంలో హైదరాబాద్ బయలుదేరాం. గేట్ వద్ద ఎయిర్లైన్స్ సిబ్బంది మాతో అమర్యాదకరంగా ప్రవర్తించారు. అందులో ఓ సిబ్బంది మాపై జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్లు అనిపించింది. నేను తరచూ ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తుంటాను కానీ ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి.’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం 8000 తెరల్లో బాహుబలి-ది కన్క్లూజన్’ విడుదల కాబోతోంది.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







