'భరత్ అను నేను' మే 18 నుంచి
- April 26, 2017
మహేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న 'స్పైడర్' సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఆ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించాలని ఆయన నిర్ణయించుకొన్న విషయం తెలిసిందే. 'శ్రీమంతుడు' వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఆ ఇద్దరూ కలసి పనిచేస్తున్న సినిమా ఇది. 'భరత్ అను నేను' పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య నిర్మించనున్నారు. ముఖ్యమంత్రిగా మహేశ్ నటించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 18న హైదరాబాద్లో మొదలవుతుందని విశ్వసనీయ సమాచారం. ఆ నెలాఖరు వరకు తొలి షెడ్యూల్ నిర్వహించి, రెండో షెడ్యూల్ను జూన్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంతో నాయికగా కియారా ఆడ్వాణీ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఆమె హిందీ సినిమా 'ఎం.ఎస్. ధోని: ది అన్టోల్డ్ స్టోరీ'లో ధోనీ భార్య సాక్షిగా నటించి అందరి మన్ననలూ పొందారు.
ఇప్పుడు మహేశ్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. కాగా ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే మూడు పాటలకు స్వరాలు కూర్చారు. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలనేది దర్శక నిర్మాతల సంకల్పం.
తాజా వార్తలు
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!









