'భరత్ అను నేను' మే 18 నుంచి
- April 26, 2017
మహేశ్ కథానాయకుడిగా నటిస్తోన్న 'స్పైడర్' సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. ఆ సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో నటించాలని ఆయన నిర్ణయించుకొన్న విషయం తెలిసిందే. 'శ్రీమంతుడు' వంటి బ్లాక్బస్టర్ మూవీ తర్వాత ఆ ఇద్దరూ కలసి పనిచేస్తున్న సినిమా ఇది. 'భరత్ అను నేను' పేరుతో రూపొందనున్న ఈ చిత్రాన్ని డి.వి.వి. దానయ్య నిర్మించనున్నారు. ముఖ్యమంత్రిగా మహేశ్ నటించే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 18న హైదరాబాద్లో మొదలవుతుందని విశ్వసనీయ సమాచారం. ఆ నెలాఖరు వరకు తొలి షెడ్యూల్ నిర్వహించి, రెండో షెడ్యూల్ను జూన్లో ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రంతో నాయికగా కియారా ఆడ్వాణీ తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. ఆమె హిందీ సినిమా 'ఎం.ఎస్. ధోని: ది అన్టోల్డ్ స్టోరీ'లో ధోనీ భార్య సాక్షిగా నటించి అందరి మన్ననలూ పొందారు.
ఇప్పుడు మహేశ్ సరసన నటించే అవకాశం దక్కించుకున్నారు. కాగా ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే మూడు పాటలకు స్వరాలు కూర్చారు. వచ్చే ఏడాది సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేవాలనేది దర్శక నిర్మాతల సంకల్పం.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







