సౌదీ సేఠ్‌ చెరలో నుంచి రేణుకను రప్పిస్తాం: నన్నపనేని

- April 26, 2017 , by Maagulf
సౌదీ సేఠ్‌ చెరలో నుంచి రేణుకను రప్పిస్తాం: నన్నపనేని

సౌదీ సేఠ్‌ చెరలో ఉన్న జయచంద్ర భార్య రేణుకను స్వదేశానికి రప్పిస్తామని మహిళా కమిషన చైర్‌పర్సన నన్నపనేని రాజకుమారి హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా ఏర్పేడులో గత శుక్రవారం జరిగిన రోడ్డుప్రమాదంలో 15మంది మృతి చెందడం, వీరిలో 12మంది ఒక్క మునగలపాళెం గ్రామస్తులే కావడం తెలిసిందే. నన్నపనేని రాజకుమారి బుధవారం మునగలపాళెంలో మృతుల కుటుంబసభ్యులను పరామర్శించారు. ఇదే ఘటనలో మరణించిన జయచంద్ర తల్లి సుభద్రమ్మ, కుటుంబసభ్యులతో మాట్లాడారు. జయచంద్ర భార్య రేణుక సౌదీలోని సేఠ్‌ చెరలో ఉ న్నారని..కడచూపులకు కూడా ఆమె రాలేకపోయిందని తెలియడంతో ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి రేణుకను స్వదేశం రప్పించే ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com