నిజాంపేట లో 'బాహుబలి' బృందం సందడి
- April 27, 2017
సినీ ప్రేక్షకలోకం రెండేళ్లుగా ఎప్పుడెప్పుగా అని ఎదురుచూస్తున్న వెండితెర దృశ్యకావ్యం ‘బాహుబలి-2’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ బాహుబలి ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.. ఈరోజు ఉదయం కూకట్పల్లి లోని శ్రీ భ్రమరాంబ థియేటర్ వద్ద బాహుబలి బృందం సందడి చేసింది. దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమ, హీరోయిన్ అనుష్క, కీరవాణి దంపతులు, ఇతర బృంద సభ్యులు థియేటర్లో ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. టిక్కెట్ల కోసం థియేటర్ వద్ద బారులు తీరిన ప్రేక్షకులు చిత్ర బృందాన్ని చూసి ఆనందానికి గురయ్యారు. కొందరు రాజమౌళి వద్దకు వెళ్లి కరచాలనం చేశారు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









