నిజాంపేట లో 'బాహుబలి' బృందం సందడి

- April 27, 2017 , by Maagulf
నిజాంపేట లో 'బాహుబలి' బృందం సందడి

సినీ ప్రేక్షకలోకం రెండేళ్లుగా ఎప్పుడెప్పుగా అని ఎదురుచూస్తున్న వెండితెర దృశ్యకావ్యం ‘బాహుబలి-2’ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ బాహుబలి ప్రదర్శిస్తున్న థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.. ఈరోజు ఉదయం కూకట్‌పల్లి లోని శ్రీ భ్రమరాంబ థియేటర్‌ వద్ద బాహుబలి బృందం సందడి చేసింది. దర్శకుడు రాజమౌళి, ఆయన భార్య రమ, హీరోయిన్‌ అనుష్క, కీరవాణి దంపతులు, ఇతర బృంద సభ్యులు థియేటర్‌లో ప్రేక్షకులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. టిక్కెట్ల కోసం థియేటర్‌ వద్ద బారులు తీరిన ప్రేక్షకులు చిత్ర బృందాన్ని చూసి ఆనందానికి గురయ్యారు. కొందరు రాజమౌళి వద్దకు వెళ్లి కరచాలనం చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com