ఘోర రోడ్డు ప్రమాదం పాక్‌లో 14 మంది మృతి

- April 30, 2017 , by Maagulf
ఘోర రోడ్డు ప్రమాదం పాక్‌లో 14 మంది మృతి

 పాకిస్థాన్‌లో ఆదివారం జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో 14 మంది దుర్మరణం పాలయ్యారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. దిర్‌ జిల్లాను చిత్రాల్‌ జిల్లాలో కలిపే ప్రధాన మార్గంలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ వాహనం అదుపుతప్పి లోయలో పడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదకరమైన మలుపు వద్ద డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడం బస్సు లోయలో పడిందని ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com