అమెరికాలోని టెక్సాస్ లో బీభత్సం సృష్టిస్తోన్న భారీవర్షాలు, వరదలు
- May 01, 2017
అమెరికాలోని టెక్సాస్ లో భారీవర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒకవైపు బలమైన టోర్నడోలు, మరోవైపు వరదల కారణంగా టెక్సాస్ లోని మధ్యప్రాంతం అతలాకుతలమైంది. ప్రకృతి విపత్తుకారణంగా పలువురు మరణించారని, వేలాదిమంది నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. దీంతో మిస్సోరి, ఒక్లహోమా ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన గవర్నర్... సహాయకచర్యలను ముమ్మరంచేసినట్లు తెలిపారు. భారీ వర్షానికి మిస్సోరిలో ఒకరు, టెక్సాస్, కాంటన్ ప్రాంతాల్లో 5గురు మరణించినట్లు ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారి బ్రిన్ హార్టన్ వెల్లడించారు. అయితే ఇప్పటివరకు వందలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 30కి పైగా రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నాయని సహాయక అధికారులు తెలిపారు. వరదల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







