అమెరికాలోని టెక్సాస్ లో బీభత్సం సృష్టిస్తోన్న భారీవర్షాలు, వరదలు
- May 01, 2017
అమెరికాలోని టెక్సాస్ లో భారీవర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒకవైపు బలమైన టోర్నడోలు, మరోవైపు వరదల కారణంగా టెక్సాస్ లోని మధ్యప్రాంతం అతలాకుతలమైంది. ప్రకృతి విపత్తుకారణంగా పలువురు మరణించారని, వేలాదిమంది నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. దీంతో మిస్సోరి, ఒక్లహోమా ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన గవర్నర్... సహాయకచర్యలను ముమ్మరంచేసినట్లు తెలిపారు. భారీ వర్షానికి మిస్సోరిలో ఒకరు, టెక్సాస్, కాంటన్ ప్రాంతాల్లో 5గురు మరణించినట్లు ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారి బ్రిన్ హార్టన్ వెల్లడించారు. అయితే ఇప్పటివరకు వందలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 30కి పైగా రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నాయని సహాయక అధికారులు తెలిపారు. వరదల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









