అమెరికాలోని టెక్సాస్ లో బీభత్సం సృష్టిస్తోన్న భారీవర్షాలు, వరదలు
- May 01, 2017
అమెరికాలోని టెక్సాస్ లో భారీవర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒకవైపు బలమైన టోర్నడోలు, మరోవైపు వరదల కారణంగా టెక్సాస్ లోని మధ్యప్రాంతం అతలాకుతలమైంది. ప్రకృతి విపత్తుకారణంగా పలువురు మరణించారని, వేలాదిమంది నిరాశ్రయులయ్యారని అధికారులు తెలిపారు. దీంతో మిస్సోరి, ఒక్లహోమా ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించిన గవర్నర్... సహాయకచర్యలను ముమ్మరంచేసినట్లు తెలిపారు. భారీ వర్షానికి మిస్సోరిలో ఒకరు, టెక్సాస్, కాంటన్ ప్రాంతాల్లో 5గురు మరణించినట్లు ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారి బ్రిన్ హార్టన్ వెల్లడించారు. అయితే ఇప్పటివరకు వందలాదిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, 30కి పైగా రెస్క్యూ టీమ్స్ పనిచేస్తున్నాయని సహాయక అధికారులు తెలిపారు. వరదల కారణంగా రవాణా వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది.
తాజా వార్తలు
- దుబాయ్ లో అడ్డగించిన డ్రోన్ల అవశేషాలు ఇళ్ల ఆవరణల్లో పడి ఇద్దరు గాయాలు
- ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్
- డీప్ ఫేక్ వీడియోలతో దుష్ప్రచారం: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
- ఏపీ నూతన సీఎస్గా జి.సాయి ప్రసాద్ బాధ్యతలు..
- సిమ్ లేకపోతే వాట్సాప్ బంద్? కొత్త రూల్స్ సంచలనం
- రెండు రోజుల పాటు సర్వదర్శనం టోకెన్ల రద్దు!
- నాగ్పుర్ ఎక్స్ప్లోజివ్ ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం: 15 మంది మృతి!
- శ్రీనగర్లో ఉద్రిక్తత..అలీ ఖమేనీ మరణవార్తతో రోడ్ల పైకి షియా ముస్లింలు
- ఐఆర్జీసీ కొత్త చీఫ్గా అహ్మద్ వాహిదీ
- ఖమేనీ తర్వాత ఎవరు? ఇరాన్ వారసత్వం పై ఉత్కంఠ









