భారత జవాన్లను నరికి చంపిన పాక్ ఆర్మీ
- May 01, 2017
నియంత్రణ రేఖ వద్ద భారత జవాన్లపై దాడికి తెగబడిన పాక్ సైన్యం తీవ్రమైన దుశ్చర్యకు పాల్పడింది. సోమవారం ఫూంచ్ సెక్టార్లోని బీఎస్ఎఫ్ సైనిక స్థావరంపై గ్రనేడ్ రాకెట్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్ల మృతదేహాలను పాక్ ఆర్మీ అతికిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికేసింది. పాక్ దుశ్చర్యను భారత ఆర్మీ తీవ్రంగా ఖండించింది. దీనిపై పాక్ తగిన సమాధానం చెప్పాలని, ఈ ఘటనకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందని భారత ఆర్మీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. పాక్ దుశ్చర్యను తుచ్ఛమైన చర్యగా పేర్కొంది. ఈ దాడిలో జేసీవో నయీబ్ సుబేదార్ పరంజీత్ సింగ్, హెడ్ కానిస్టేబుల్ ప్రేమ్ సాగర్ అమరులయ్యారు. జవాన్లపై పాక్ దాడి విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమీక్షించారు. ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి జమ్ముకశ్మీర్లోని పరిస్థితుల గురించి ఆరా తీశారు.
తాజా వార్తలు
- దుబాయ్లో పేలుళ్లు జరిగాయంటూ తప్పుడు వార్త.. దర్యాప్తు విస్తరించిన యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన�
- ప్రజాకవి అందె సీఎం రేవంత్ ఘన నివాళులు..
- బ్రెయిన్ ఇంజ్యూరీ నుంచి జాతీయ సేవలోకి..ఓ టీన్ స్ఫూర్తి ప్రయాణం..!!
- నౌకలు యజమానులకు 30 రోజుల గడువుచ్చిన ఒమన్..!!
- షైఖ్ ఖలీఫా బిన్ సల్మాన్ స్ట్రీట్లో ప్రమాదం.. వ్యక్తి మృతి..!!
- అమ్మాన్–సనా మధ్య కమర్షియల్ ఫ్లైట్స్..స్వాగతించిన సౌదీ..!!
- కువైట్ ఎయిర్వేస్ విమానాల షెడ్యూల్లో మార్పులు..!!
- ఫహాహీల్లో కీలక ఇంటర్ సెక్షన్ వారం రోజులపాటు మూసివేత..!!
- స్కైరూట్ ఏరోస్పేస్ అద్భుతం..విజయవంతంగా విక్రమ్-1 రాకెట్ ప్రయోగం!
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..







