భారత జవాన్లను నరికి చంపిన పాక్‌ ఆర్మీ

- May 01, 2017 , by Maagulf
భారత జవాన్లను నరికి చంపిన పాక్‌ ఆర్మీ

నియంత్రణ రేఖ వద్ద భారత జవాన్లపై దాడికి తెగబడిన పాక్‌ సైన్యం తీవ్రమైన దుశ్చర్యకు పాల్పడింది. సోమవారం ఫూంచ్‌ సెక్టార్‌లోని బీఎస్‌ఎఫ్‌ సైనిక స్థావరంపై గ్రనేడ్‌ రాకెట్లతో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు జవాన్ల మృతదేహాలను పాక్‌ ఆర్మీ అతికిరాతకంగా ముక్కలు ముక్కలుగా నరికేసింది. పాక్‌ దుశ్చర్యను భారత ఆర్మీ తీవ్రంగా ఖండించింది. దీనిపై పాక్‌ తగిన సమాధానం చెప్పాలని, ఈ ఘటనకు తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటుందని భారత ఆర్మీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. పాక్‌ దుశ్చర్యను తుచ్ఛమైన చర్యగా పేర్కొంది. ఈ దాడిలో జేసీవో నయీబ్‌ సుబేదార్‌ పరంజీత్‌ సింగ్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రేమ్‌ సాగర్‌ అమరులయ్యారు. జవాన్లపై పాక్‌ దాడి విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సమీక్షించారు. ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితుల గురించి ఆరా తీశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com