ముంబై నుంచి అబుదాబికి ఎమాన్ అహ్మద్
- May 02, 2017
ప్రపంచంలోనే అత్యంత బరువు కలిగిన మహిళగా పేరు పొందిన ఈజిప్టు మహిళ ఇమాన్ అహ్మద్ను బుధవారం తెల్లవారుజాము 2గంటలకు ప్రత్యేక విమానంలో అబుదాబి తరలించనున్నారు. ఎమాన్కు సరిపోయే విధంగా ప్రత్యేకమైన సదుపాయాలతో ఏర్పాటు చేసిన కార్గో ఎయిర్క్రాఫ్ట్ ముంబయి విమానాశ్రయం నుంచి తరలిస్తున్నట్లు ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(ఎంఐఏఎల్) అధికారులు వెల్లడించారు. బరువు తగ్గించుకునే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకునేందుకు ఫిబ్రవరి 11న ఎమాన్ ముంబయిలోని సైఫీ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు వైద్యులు సరైన చికిత్స అందించడం లేదని.. వైద్యం చేస్తున్నట్లు అబద్ధాలు చెప్తున్నట్లు ఎమాన్ సోదరి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందువల్లే ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు ముంబయి నుంచి అబుదాబికి తరలిస్తున్నట్లు ఆమె సోదరి తెలిపారు.
అబుదాబికి చెందిన బుర్జీల్ ఆసుపత్రిలో తొమ్మిది మంది వైద్యబృందం నేతృత్వంలో ఆమెకు చికిత్స అందించనున్నట్లు అక్కడి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎమాన్ చికిత్సకు సంబంధించిన దాదాపు పదివేల మెడికల్ రికార్డులను అబుదాబి వీపీఎస్ హెల్త్కేర్ సిబ్బందికి ప్రత్యేక విమానంలో పంపించారు.
తాజా వార్తలు
- పాస్పోర్ట్, వీసా, కాన్సులర్ సేవలను జూలై 1 నుంచి అల్ హింద్ కు గ్రీన్ సిగ్నల్
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ









