ముంబై నుంచి అబుదాబికి ఎమాన్ అహ్మద్
- May 02, 2017
ప్రపంచంలోనే అత్యంత బరువు కలిగిన మహిళగా పేరు పొందిన ఈజిప్టు మహిళ ఇమాన్ అహ్మద్ను బుధవారం తెల్లవారుజాము 2గంటలకు ప్రత్యేక విమానంలో అబుదాబి తరలించనున్నారు. ఎమాన్కు సరిపోయే విధంగా ప్రత్యేకమైన సదుపాయాలతో ఏర్పాటు చేసిన కార్గో ఎయిర్క్రాఫ్ట్ ముంబయి విమానాశ్రయం నుంచి తరలిస్తున్నట్లు ముంబయి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(ఎంఐఏఎల్) అధికారులు వెల్లడించారు. బరువు తగ్గించుకునే బేరియాట్రిక్ సర్జరీ చేయించుకునేందుకు ఫిబ్రవరి 11న ఎమాన్ ముంబయిలోని సైఫీ ఆసుపత్రికి వచ్చింది. ఆమెకు వైద్యులు సరైన చికిత్స అందించడం లేదని.. వైద్యం చేస్తున్నట్లు అబద్ధాలు చెప్తున్నట్లు ఎమాన్ సోదరి ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. అందువల్లే ఆమెకు మెరుగైన చికిత్స అందించేందుకు ముంబయి నుంచి అబుదాబికి తరలిస్తున్నట్లు ఆమె సోదరి తెలిపారు.
అబుదాబికి చెందిన బుర్జీల్ ఆసుపత్రిలో తొమ్మిది మంది వైద్యబృందం నేతృత్వంలో ఆమెకు చికిత్స అందించనున్నట్లు అక్కడి ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఎమాన్ చికిత్సకు సంబంధించిన దాదాపు పదివేల మెడికల్ రికార్డులను అబుదాబి వీపీఎస్ హెల్త్కేర్ సిబ్బందికి ప్రత్యేక విమానంలో పంపించారు.
తాజా వార్తలు
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!
- కువైట్ లో వీసా గడువు పొడిగింపు, విదేశాలలో ఉన్నవారికి సెలవు మంజూరు..!!
- ఇరాన్ దురాక్రమణను ఖండించండి..అంతర్జాతీయ సమాజానికి సౌదీ పిలుపు..!!









