ఆల్కహాల్, నిషేధిత వస్తువుల విక్రయం: ముగ్గురి అరెస్ట్
- May 04, 2017
ఆల్కహాల్ బెవరేజెస్ అలాగే నిషేధ వస్తువుల్ని అక్రమంగా విక్రయిస్తున్న కేసులో ముగ్గురు నిందితుల్ని రాయల్ ఒమన్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. అడమ్ పోలీస్ స్టేషన్కి చెందిన అధికారులు, ఇద్దరు ఆసియా జాతీయుల్ని, అక్రమంగా ఆల్కహాల్ బెవరేజెస్తోపాటు, నిషేధ వస్తువుల్ని అమ్ముతున్న కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. రాయల్ ఒమన్ పోలీసులు 100 బాటిళ్ళకు పైగా ఆల్కహాల్ బెవరేజెస్, 30 బాక్సుల్లో సిగరెట్లను నిందితుల ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో, డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ - ఇజ్కి పోలీస్ స్టేషన్ అధికారులు, ఆసియా జాతీయుడిని అరెస్ట్ చేయడంతోపాటు అతని నుంచి 140 బాటిళ్ళ ఆల్కహాల్ బెవరేజెస్ బాక్స్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఓ ప్రైవేటు వాహనంలో నిందితుడు విక్రయించేందుకు ప్రయత్నించాడు. నిందితులపై చట్టపరమైన చర్యలుంటాయని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్లో డ్రైవర్కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!







