బీడ్స్తో భారతీయ కళాకారిణి అద్భుత కళాఖండాలు
- May 05, 2017
కటారా, అరుదైన అద్భుతమైన కళాఖండాల ప్రదర్శనకు వేదిక కానుంది. బీడ్స్, కాఫీ పౌడర్, పేపర్ క్లిప్పింగ్స్, వ్యాక్స్ మరియు ఎంబ్రాయిడరీ వంటివాటితో అరుదైన కళాఖండాలు ఇక్కడ ప్రదర్శనకు రానున్నాయి. భారతదేశానికి చెందిన కళాకారిణి నసీమా షుకూర్ సుమారు 42 మాస్టర్ పీసెస్ని 'బీడ్స్ మరియు మొసాయిక్ ఆర్ట్' ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నారు. మే 17 వరకు బిల్డింగ్ 22లో ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. 'హోలీ మస్జిద్ ఆఫ్ మక్కా'ని తన కళ ద్వారా అద్భుతంగా మలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారామె. 600,000 సర్క్యులర్ పేపర్ బిట్స్తో దీన్ని ఆమె రూపొందించారు. ఎవరూ ఊహించని విధంగా ఆమె పలు వస్తువులతో కళాఖండాల్ని తయారుచేస్తుంటారు. కటారా జనరల్ మేనేజర్ డాక్టర్ ఖాలిద్ బిన్ ఇబ్రహీం అల్ సులైటి మాట్లాడుతూ, ఖతారీ సిటిజన్స్ అలాగే వలసదారుల్ని ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణలో ‘ఆపరేషన్ ముస్కాన్’..
- అమర్నాథ్ భక్తులకు గుడ్ న్యూస్..
- దుబాయ్లో మరో 9 కొత్త మాల్స్..
- కువైట్లో పౌర లక్ష్యాలపై ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన జీసీసీ..
- దిగ్గజ పర్వతారోహకుడు నిర్మల్ పూర్జా మృతి
- ఆగస్టు 1 నుంచి ఫ్రీగా నెట్ఫ్లిక్స్.. 30 రోజులు ఫుల్ ఎంటర్టైన్మెంట్!
- తెలంగాణలో ‘వైన్ టూరిజం’..
- సీఎం రేవంత్ రెడ్డి విదేశీ టూర్ ఫిక్స్
- ఫర్వానియాలో ఆహార తనిఖీలు..!!
- రియాద్లో తాయిఫ్ రోడ్ విస్తరణకు శ్రీకారం..!!







