బీడ్స్తో భారతీయ కళాకారిణి అద్భుత కళాఖండాలు
- May 05, 2017
కటారా, అరుదైన అద్భుతమైన కళాఖండాల ప్రదర్శనకు వేదిక కానుంది. బీడ్స్, కాఫీ పౌడర్, పేపర్ క్లిప్పింగ్స్, వ్యాక్స్ మరియు ఎంబ్రాయిడరీ వంటివాటితో అరుదైన కళాఖండాలు ఇక్కడ ప్రదర్శనకు రానున్నాయి. భారతదేశానికి చెందిన కళాకారిణి నసీమా షుకూర్ సుమారు 42 మాస్టర్ పీసెస్ని 'బీడ్స్ మరియు మొసాయిక్ ఆర్ట్' ఎగ్జిబిషన్లో ప్రదర్శించనున్నారు. మే 17 వరకు బిల్డింగ్ 22లో ఈ ప్రదర్శన అందుబాటులో ఉంటుంది. 'హోలీ మస్జిద్ ఆఫ్ మక్కా'ని తన కళ ద్వారా అద్భుతంగా మలిచి తన ప్రత్యేకతను చాటుకున్నారామె. 600,000 సర్క్యులర్ పేపర్ బిట్స్తో దీన్ని ఆమె రూపొందించారు. ఎవరూ ఊహించని విధంగా ఆమె పలు వస్తువులతో కళాఖండాల్ని తయారుచేస్తుంటారు. కటారా జనరల్ మేనేజర్ డాక్టర్ ఖాలిద్ బిన్ ఇబ్రహీం అల్ సులైటి మాట్లాడుతూ, ఖతారీ సిటిజన్స్ అలాగే వలసదారుల్ని ఈ ఎగ్జిబిషన్ ఎంతగానో ఆకట్టుకుంటుందని చెప్పారు.
తాజా వార్తలు
- 65 ఏళ్ల చరిత్ర కలిగిన పోలీస్ ఆఫీసర్స్ మెస్ను సమీక్షించిన డీజీపీ సి.వి.ఆనంద్
- మెటా సోషల్ మీడియా సేవలు పునరుద్ధరణ..
- డీజిల్ భారం తగ్గాల్సిందే: TGSRTC ఎండీ వై.నాగిరెడ్డి
- డ్రగ్స్ తో పట్టుబడిన మోడల్
- ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ సేవలకు అంతరాయం
- తిరుపతిలో NDA కూటమి విజయోత్సవ సభ
- కేవలం 23 ఏళ్లకే ఏకంగా 19 ప్రభుత్వ ఉద్యోగాలు..ఈ అమ్మాయి సీక్రెట్ ఏంటి?
- ముగిసిన సైబరాబాద్ ప్రెస్ & పోలీస్ ఫ్రెండ్లీ క్రికెట్ లీగ్–2026
- దుబాయ్ లో బుర్జీల్ ప్రతినిధులతో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ
- ఎతిహాద్ రైల్ పనుల కోసం దుబాయ్–షార్జా మార్గంలో రాత్రి వేళ ట్రాఫిక్ ఆంక్షలు









